Assembly Polls: మిజోరం, ఛత్తీస్గఢ్ తొలి విడతకు ముగిసిన ప్రచారం.. మినీ సంగ్రామానికి కౌంట్డౌన్!
మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలతోపాటు ఛత్తీస్గఢ్లోని 20స్థానాలకు మొదట విడతలో నవంబర్ 7న పోలింగ్ (Assembly Elections) జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలను (Assembly Elections) మినీ సంగ్రామంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో మిజోరంలోని (Mizoram) మొత్తం 40 అసెంబ్లీ స్థానాలతోపాటు ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh Polls) 20స్థానాలకు మొదట విడతలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించగా.. మంగళవారం పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో ప్రచారానికి తెరపడింది. నవంబర్ 7న రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 60 శాసనసభ స్థానాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
త్రిముఖ పోరు..
మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా.. 8.57లక్షల మంది ఓటర్లున్నారు. మొత్తం 174 మంది బరిలో నిలబడ్డారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), జోరం పీపుల్స్ మూమెంట్, కాంగ్రెస్లు పూర్తిస్థాయిలో అభ్యర్థులను రంగంలో దించాయి. భాజపా 23 మందిని, ఆమ్ఆద్మీపార్టీ నలుగురిని పోటీలో నిలిపాయి. మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఐదేళ్ల కిందట కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వంటి నేతలతో అక్కడ ప్రచారం నిర్వహించింది. తాజాగా మిజో ఓటర్లను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ‘అద్భుత మిజోరం’కు భాజపా కట్టుబడి ఉందని.. ఇందుకు రాష్ట్ర ప్రజల మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. అక్టోబర్ 30న మిజోరంలో ప్రధాని పర్యటించాల్సి ఉన్నప్పటికీ ఆకస్మికంగా అది రద్దయ్యింది.
ఇంటినుంచే ఓటేసిన 2 వేల మంది..
మిజోరంలో పోలింగ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులకు పోస్టల్ బ్యాలెట్తోపాటు వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటినుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇలా 2059 మంది వృద్ధులు, దివ్యాంగులు, 8526 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తంగా 10,585 మంది ఈ వెసులుబాటు పొందారని తెలిపారు.
కాంగ్రెస్ వర్సెస్ భాజపా..
ఛత్తీస్గఢ్లో తొలివిడతలో 20 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. తొలివిడత ఎన్నికలకు కొన్ని గంటల ముందే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతులు, మహిళా సంఘాలకు రుణమాఫీతో పాటు రాయితీపై వంటగ్యాస్, భూమిలేని పేదలకు ఆర్థిక సాయం వంటి హామీలను గుప్పించింది. మరోవైపు, భాజపా కూడా ముమ్మర ప్రచారం చేసింది. గురేలా-పెండ్రా-మార్వాలి (జీపీఎం) జిల్లాలో ప్రచారంలో పాల్గొన్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడుతోందంటూ విరుచుకుపడ్డారు. ఇక ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్లోని డోంగార్గఢ్లో ఉన్న బమ్లేశ్వరీ అమ్మవారి దేవాలయంతోపాటు చంద్రగిరిలో జైన్ మందిర్ను దర్శించుకున్నారు. అక్కడ ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ ఆశీస్సులు తీసుకున్నట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
మిజోరంలో జోరెవరిదో!.. అధికార పీఠంపై ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ కన్ను
ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలివిడత 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. మిగతా 70 స్థానాలకు నవంబర్ 17న మరోవిడతలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న 20 స్థానాల్లో ఎక్కువగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఇదిలాఉంటే, మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17న ముగుస్తుండగా.. ఛత్తీస్గఢ్ శాసనసభ గడువు మాత్రం జనవరి 3, 2024తో ముగియనుంది. ఆలోపే ఈ రెండు రాష్ట్రాలతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు పూర్తవనున్నాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.