Parliament: బడ్జెట్ సమావేశాల వేళ.. 14 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత!
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతోన్న వేళ.. గత శీతాకాల సమావేశాల నుంచి 14 మంది విపక్ష ఎంపీలపై కొనసాగుతోన్న సస్పెన్షన్ను ఎత్తేశారు.
దిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Budget Session) జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో.. గత శీతాకాల సమావేశాల నుంచి 14 మంది విపక్ష ఎంపీలపై కొనసాగుతోన్న సస్పెన్షన్ను లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్లు ఎత్తివేశారు. దీంతో బుధవారం నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో వారు పాల్గొనేందుకు మార్గం సుగమమైంది.
పార్లమెంటులో భద్రత వైఫల్యం ఘటనపై ప్రతిపక్షాల ఆందోళనలతో గతేడాది శీతాకాల సమావేశాల సమయంలో లోక్సభ, రాజ్యసభలు దద్దరిల్లాయి. ఉభయ సభల్లో మొత్తం 146 మంది ఎంపీల (100 మంది లోక్సభ, 46 మంది రాజ్యసభ)పై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో 132 మందిపై అప్పటి సమావేశాల వరకే చర్యలు తీసుకున్నారు. మిగతా 14 మంది ఎంపీల (11 మంది రాజ్యసభ, ముగ్గురు లోక్సభ) ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి.. సభాహక్కుల కమిటీ (Privileges Committee)లకు సిఫార్సు చేశారు.
31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు లోక్సభ ఎంపీలు.. అబ్దుల్ ఖాలిక్, కె.జెయకుమార్, విజయ్ వసంత్లు తమ ప్రవర్తనపై విచారం వ్యక్తం చేశారని, ఈ నేపథ్యంలో వారి సస్పెన్షన్ను రద్దు చేయాలని లోక్సభా సభాహక్కుల కమిటీ సిఫార్సు చేసింది. రాజ్యసభ సభాహక్కుల కమిటీ మాత్రం.. ఆ 11 మంది ఎంపీలు నిబంధనల ఉల్లంఘన, సభా ధిక్కారానికి పాల్పడినట్లు తేల్చింది. ఈమేరకు మంగళవారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖఢ్కు నివేదిక సమర్పించింది. సస్పెన్షన్ కాలాన్ని తగిన శిక్షగా పరిగణించాలని కూడా సిఫార్సు చేసింది. ఈ క్రమంలోనే రాజ్యసభ ఛైర్మన్ తన అధికారాన్ని వినియోగించుకుని వారి సస్పెన్షన్ను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ముందు నిర్వహించనున్న చివరి సమావేశాలు ఇవే. కీలక బిల్లులన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ (Interim Budget) పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఏప్రిల్- మేలో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్ప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. -
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. -
అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎయిర్ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉత్తరాఖండ్ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్
ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. -
సీబీఐపై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు
హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్ చెరలోనే ఉన్నారు. -
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు