Delhi: అనుమానాస్పదస్థితిలో నైజీరియన్‌తో పాటు మరొకరు మృతి

నైజీరియాకు చెందిన వ్యక్తితో పాటు మరొకరు దిల్లీలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. 

Published : 28 Feb 2024 01:20 IST

దిల్లీ: కాలిన గాయాలతో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు దిల్లీలో మృతి చెందారు. మృతుల్లో ఒకరు నైజీరియాకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు ఎవరనేది గుర్తించాల్సి ఉంది. దిల్లీలోని బురారీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఈ నెల 23న ఓ ఇంట్లో కాలిన గాయాలతో ఉండడంతో ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితులను ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తులు తాము వారి స్నేహితులమని చెప్పి.. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. చికిత్స పొందుతూ వారిద్దరూ మంగళవారం మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని