Kashmir: ఆహారం కోసం స్థానికుడిని కొట్టిన ఉగ్రవాదులు.. ఎన్కౌంటర్ చేసిన సైన్యం..!
తమ అవసరాలు తీర్చలేదని స్థానికులను హింసించిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ప్రస్తుతం కాలాకోట్లో జరుగుతున్న ఎన్కౌంటర్లో లష్కరే కీలక కమాండర్ను మన దళాలు హతమర్చాయి.
ఇంటర్నెట్డెస్క్: కశ్మీర్లోని ఓ గ్రామంలో ఆహారం కోసం కొందరు ఉగ్రవాదులు స్థానికులను దారుణంగా కొట్టారు.. ఈ విషయం సైన్యానికి తెలిసింది. అంతే భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఐదుగురు సైనిక సిబ్బంది మృతి చెందారు. అయినా లెక్కచేయకుండా ఆపరేషన్ కొనసాగించి ఉగ్రసంస్థ టాప్ కమాండర్ను మన దళాలు మట్టుబెట్టాయి.
జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లా కాలాకోట్ అడవుల్లో దాదాపు 24 గంటల నుంచి జరుగుతున్న భీకర ఎన్కౌంటర్లో పురోగతి కనిపించింది. నేడు భద్రతా దళాలు లష్కరే తొయిబా సంస్థకు చెందిన ఒక టాప్ కమాండర్ను, ఒక స్నిపర్ను హతమార్చాయి. మృతులను పాక్ జాతీయులుగా గుర్తించారు. వీరిలో ఖారీ అనే ఉగ్రవాది లష్కరేలో అత్యున్నత హోదాలో పనిచేస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని మళ్లీ ఎగదోయడమే లక్ష్యంగా అతడు పాక్ నుంచి వచ్చాడు. ఐఈడీలను పేల్చడం, గుహల్లో దాక్కొని ఉగ్రకార్యకలాపాలు జరపడంలో నిపుణుడిగా అతడిని సైన్యం గుర్తించింది. ఈ ఎన్కౌంటర్పై సైన్యం పీఆర్వో మాట్లాడుతూ ఖారీ అనే ఉగ్రవాది అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లలో శిక్షణ పొందాడని పేర్కొన్నారు. అతడు లష్కరే ఉన్నత స్థాయి హోదాలో పనిచేస్తున్నాడని వెల్లడించారు. ఇక మరణించిన రెండో ఉగ్రవాది అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన స్నిపర్గా పేర్కొన్నారు.
స్థానికులపై దాడితో వెలుగులోకి..
ఇటీవల బిజిమాల్ గ్రామం వద్ద ఆహారం ఇవ్వలేదని స్థానిక గుజ్జర్ను కొందరు ఉగ్రవాదులు దారుణంగా కొట్టారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు భద్రతా దళాలకు సమాచారం అందించారు. వెంటనే సైన్యం ఇతర దళాలతో సమన్వయం చేసుకొంటూ యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేపట్టింది. కాకపోతే పర్వతాల్లో నక్కిన ఉగ్రవాదులకు అక్కడి ప్రాంతాలపై పరిజ్ఞానం ఉండటంతో మన దళాలపై భారీగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కెప్టెన్లతోపాటు.. మరో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన మరో సైనికుడు నేడు మరణించాడు.
నిన్న రాత్రే అదపు బలగాలను ఈ ప్రాంతానికి రప్పించి.. ఉగ్రవాదులు నక్కిన ప్రదేశాన్ని పూర్తిగా మన భద్రతా దళాలు చుట్టుముట్టాయి. తొలుత ఇద్దరు ఉగ్రవాదులే ఉన్నట్లు భావించారు. కానీ, కాల్పులు జరిగిన తీరును అంచనావేసిన తర్వాత వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఈ ఉగ్రవాదులు దాదాపు ఏడాది నుంచి రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సైన్యం అంచనాకొచ్చింది. డాంగ్రి, కాండీ దాడులకు ఇతడే మాస్టర్మైండ్ అని భావిస్తున్నారు. ఈ దాడుల్లో పౌరులు మృతి చెందారు. ఇక నవంబర్ 19వ తేదీన ఇక్కడ ఉగ్రకదలికలపై సమాచారం అందడంతో సైన్యం కూంబింగ్ చేపట్టింది. బుధవారం ఉదయం ఎన్కౌంటర్ మొదలైంది. దీనిలో 9 పారా ఎస్ఎఫ్కు చెందిన కెప్టెన్ శుభం గుప్తా, 63 రాష్టీయ రైఫిల్స్కు చెందిన కెప్టెన్ ఎంవీ ప్రంజల్ , హవాల్దార్ అబ్దుల్ మాజిద్, మరో ఇద్దరు సైనికులు మరణించారు. మరో మేజర్ ఈ ఎన్కౌంటర్లో గాయపడ్డారు.
గత రెండేళ్లలో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడుల్లో కనీసం 30 మంది సైనిక సిబ్బంది మరణించారు. 2003-21 వరకు ఇక్కడ ఉగ్రకదలికలు తగ్గాయి. కానీ, ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో భారీగా ఉగ్రకార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పీర్పంజల్ రేంజిలోని పూంచ్, రాజౌరీల్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు బాగా పెరిగాయి. పాక్ నుంచి సరిహద్దు దాటుకొని ఇక్కడకు వచ్చిన ఉగ్రవాదులు శ్రీనగర్ లేదా దోడా వెళ్లాలన్నా అనంతనాగ్ మీదుగానే ప్రయణించాలి. దీంతో ఉగ్రవాదులకు ఇది ముఖ్యమైన గమ్యస్థానంగా మారింది. కశ్మీర్లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో పీర్ పంజాల్ పర్వశ్రేణులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడున్న బనిహాల్, హాజిపీర్, పీర్పంజాల్ పాస్లు అత్యంత కీలకమైనవి.
ఇక్కడి దాదాపు 15 వేల అడుగుల ఎత్తుండే ఈ పర్వతశ్రేణుల భౌగోళిక స్వరూపం సైనిక ఆపరేషన్లకు ఏ మాత్రం అనుకూలించదు. ఇక్కడి పరిస్థితి అఫ్గానిస్థాన్లోని పర్వత శ్రేణుల్లా ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతారు. దీనికి చిక్కటి అడవులు తోడు కావడంతో ఎంత పెద్ద దళానికైనా.. ఒకరు లేదా ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకోవాలన్నా భారీగా శ్రమించాల్సి వస్తుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా ఇక్కడకు అత్యంత సమీపంలోనే ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత