Republic Day: పాక్ పాలకుడు గణతంత్ర వేడుకలకు వచ్చిన వేళ..
గణతంత్ర దినోత్సవం నాడు విదేశీ అతిథికి ఆతిథ్యం ఇవ్వడం భారత్లో కీలకమైన సంప్రదాయంగా వస్తోంది. దీనిలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. సరిహద్దుల్లో పాక్ సేనలు రెచ్చిపోతున్నా.. ఆ దేశ మంత్రికి ఆతిథ్యమిచ్చిన చరిత్ర ఉంది.
ఇంటర్నెట్డెస్క్: భారత గణతంత్ర దినోత్సవానికి ఓ దేశాధినేత అతిథిగా రావడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కొవిడ్-19 కారణంగా 2021, 2022 రిపబ్లిక్ డే పరేడ్లకు విదేశీ నేతలు ఎవరూ హాజరు కాలేదు. బరాక్ ఒబామా(అమెరికా), నెల్సన్ మండేలా(దక్షిణాఫ్రికా), పుతిన్(రష్యా), షింజో అబే(జపాన్) వంటి మహామహులు గతంలో హాజరయ్యారు. ఒకసారి పాకిస్థాన్ పాలకుడు.. మరోసారి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక నేత వంటి వారు కూడా పాల్గొన్నారు.
* 1950లో తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్ణో హాజరయ్యారు. భారత ప్రధాని నెహ్రూతో కలిసి అలీనోద్యమ సంస్థ ‘నామ్’ను స్థాపించారు. నెహ్రూ - సుకర్ణో మంచి మిత్రులు. భారత్ తొలి గణతంత్ర వేడుకలు దిల్లీలోని ఇర్విన్ స్టేడియంలో జరిగాయి.
* 1955లో పాక్ గవర్నర్ జనరల్ మాలిక్ గులాం మహమ్మద్ను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇరు దేశాలు ఒకే విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయని.. వాటిని సమన్వయంతో పరిష్కరించుకొని మందుకు పోవాలని ఈ సందర్భంగా గులాం మహమ్మద్ వ్యాఖ్యానించారు.
* 1958 జనవరి 22 నుంచి మార్చి 3వ తేదీ వరకు భారత్లో చైనా కమ్యూనిస్టు పార్టీ సైనిక నాయకుడు యె జియాన్యింగ్ భారత్లో పర్యటించారు. ఆయన రిపబ్లిక్ డే సంబరాల్లో పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఏకైక చైనా నాయకుడు ఆయనే.
* బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్ ఇద్దరు వేర్వేరు సందర్భాల్లో భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు. 1958లో ప్రిన్స్ ఫిలిప్ పాల్గొనగా.. 1961లో క్వీన్ ఎలిజబెత్కు ఆతిథ్యం ఇచ్చాం. వేర్వేరుగా రిపబ్లిక్ డే ఆతిథ్యం స్వీకరించిన జంట వీరే.
* 1965లో నాటి పాక్ ఆహారశాఖ మంత్రి రాణా అబ్దుల్ హమీద్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. అప్పటికే గుజరాత్లోని కచ్ వద్ద భారత్- పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్ని నెలలకే ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారింది.
* 1966 జనవరి 11న ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం కారణంగా భారత్ గణతంత్ర దినోత్సవానికి విదేశీ అతిథిని ఆహ్వానించలేదు. ఆ తర్వాత 13 రోజుల పాటు గుల్జారీ లాల్ నందా తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు. రిపబ్లిక్డేకు రెండు రోజుల ముందు ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
* ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు జాక్వెస్ షిరాక్ రెండు సార్లు.. రెండు హోదాల్లో భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు. 1976లో ఫ్రాన్స్ ప్రధాని హోదాలో హాజరుకాగా.. 1998లో ఆ దేశ అధ్యక్షుడి హోదాలో పాల్గొన్నారు.
* భూటాన్ పాలకులు జిగ్మే డోర్జి వాంగ్చుక్(1954), జిగ్మే సింగే వాంగ్చుక్ (1984, 2005), జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్చుక్ (2013)లో గణతంత్ర దినోత్సవ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన తండ్రి, కుమారుడు, మనమడు వీరే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.