Swati Maliwal: మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
తనపై దాడి జరిగిందని స్వాతీమాలీవాల్ (Swati Maliwal) ఆరోపించిన రోజునాటి దృశ్యాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి.
దిల్లీ: ఆప్ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందంటూ ఆ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్ (Swati Maliwal) ఆరోపణల నేపథ్యంలో.. మరికొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. బయటకు తీసుకువెళ్తున్న సిబ్బందిని ఆమె వదిలించుకునే ప్రయత్నం చేశారు. నిజాలు వెలుగులోకి వచ్చాయంటూ.. ఘటన రోజు, ఆమె కోర్టు ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లిన రోజు దృశ్యాలున్న వీడియోను ఆప్ షేర్ చేసింది.
శుక్రవారం కూడా కేజ్రీవాల్ ఇంటి నుంచి ఒక క్లిప్ బయటకు వచ్చింది. అందులో ఆమె భద్రతా సిబ్బందితో వాదించడం కనిపించింది. ఆ వీడియో వెలుగులోకి రాగానే.. హిట్మ్యాన్ అంటూ మాలీవాల్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా.. ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారని విమర్శించారు. అయితే ఆమె చెప్పిన హిట్మ్యాన్ ఎవరో తెలియాల్సి ఉంది.
తనపై సీఎం సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారంటూ స్వాతి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన కూడా మాలీవాల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఆరోపణలు చేయడం వెనక భాజపా కుట్ర ఉందని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్వాతి ఓ పావు మాత్రమేనన్నారు. అపాయింట్మెంట్ లేకుండా ముఖ్యమంత్రి ఇంటికి స్వాతి చేరుకున్నారని, కేజ్రీవాల్పై ఆరోపణలు చేయడమే ఆమె ఉద్దేశమని ఆప్ సీనియర్ నేత ఆతిశీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం: ఖర్గే
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 295కు పైగా సీట్లు సాధిస్తుందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. -
దిల్లీ రికార్డు ఉష్ణోగ్రత.. సెన్సర్ ఎర్రర్ కారణం: కేంద్రం
దేశ రాజధాని దిల్లీ (Delhi)లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలపై కేంద్రం తాజాగా స్పష్టత ఇచ్చింది. సెన్సర్ సమస్యే అందుకు కారణమని తెలిపింది. -
ఎగ్జిట్ పోల్స్పై చర్చల్లో పాల్గొంటాం..: ‘ఇండియా’ కూటమి ప్రకటన
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనాలని ‘ఇండియా’ కూటమికి చెందిన పార్టీలు నిర్ణయించాయి. -
కేజ్రీవాల్ ఇంటికి అంబులెన్స్ పంపిన భాజపా నేత
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్య సమస్యల దృష్ట్యా తనకు బెయిల్ పొడిగించాలని సుప్రీంను అభ్యర్థించిన నేపథ్యంలో భాజపా నేత, సీఎం ఇంటికి అంబులెన్స్ పంపడం రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీసింది. -
పుట్టెడు దుఃఖంలోనూ.. ‘ఓటు’ బాధ్యత మరవలేదు
ఇంటి పెద్దదిక్కు కన్ను మూసినా.. ఓటును హక్కును మరవలేదు బిహార్లోని ఓ కుటుంబం. ఓటు బాధ్యతను నిర్వర్తించాకే.. అంత్యక్రియులు నిర్వహించింది. -
బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట.. రేపు తిరిగి జైలుకు
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును దిల్లీకోర్టు జూన్ 5కు వాయిదా వేసింది. దాంతో రేపు ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి..!
Prajwal Revanna: మహిళలపై అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్కు మోదీ నివాళులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 45 గంటల సుదీర్ఘ ధ్యానం ముగిసింది. -
92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!
ఝార్ఖండ్లోని సాహిబ్గంజ్కు చెందిన ఖలీల్ అన్సారీ.. తన 92 ఏళ్ల వయసులో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్ కొనసాగుతోంది. 15 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ స్టేషన్ హిమాచల్ప్రదేశ్లోని మండి నియోజకవర్గంలో ఉంది. -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
చెన్నై నుంచి ముంబయి బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. -
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
బ్రాంచ్ ఫొటో తీసి, ఒక వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఎస్బీఐ(SBI) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
ఓ అల్లరి మూక పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని(EVM) చెరువులో విసిరేసిన ఘటన పశ్చిమ బెంగాల్ కుల్తాలీ గ్రామంలో చోటుచేసుకుంది. -
సల్మాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగర్.. పాక్ నుంచి ఏకే-47 తుపాకులు..!
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్పై దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కాగా కుట్రలు రచించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ ముఠా సభ్యులు నటుడి కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
శాంపిళ్లు మార్చినట్లు ఆరోపణలు..పుణె కారు ప్రమాద ఘటనలో బాలుడి తల్లి అరెస్టు
పుణె కారు ప్రమాద ఘటన (Pune Car Crash)లో మరో అరెస్టు చోటుచేసుకుంది. కొద్దిరోజుల పాటు జాడలేకుండా పోయిన నిందితుడి తల్లి పోలీసులకు చిక్కారు. -
నాగ్పుర్లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత
Nagpur Temperature: నాగ్పుర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నిజం కాదని వాతావరణ శాఖ వెల్లడించింది. సెన్సర్ తప్పిదం వల్లే 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు స్పష్టం చేసింది. -
అంచనాల కంటే ముందే వర్షాలు!
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని గురువారం ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. అనుకున్న తేదీ కన్నా ముందే పలు ప్రాంతాల్లోకి ఇవి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని తాజాగా వెల్లడించింది. -
నడక.. జపం.. ధ్యానం
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. రెండోరోజు కార్యక్రమ వీడియోలను భాజపా విడుదల చేసింది. -
రేపు లొంగిపోతా..
ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి లొంగిపోనున్నారు. -
భారత్ ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెల్ సంస్థ తీవ్ర యత్నం
ఇజ్రాయెల్ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ... భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి తీవ్ర ప్రయత్నం చేసిందని చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వెల్లడించింది. -
ఎయిరిండియా విమానం 24 గంటలు ఆలస్యం.. ఉక్కపోతతో స్పృహతప్పిన ప్రయాణికులు
దేశ రాజధాని దిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్ VS బేస్బాల్.. రెండింటి మధ్య తేడా అదేనని చెప్పా: యువరాజ్
-
ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం: ఖర్గే
-
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. మూడోసారీ అధికారం ఎన్డీయేదే!
-
తెలంగాణలో హస్తం, కమలం నువ్వా నేనా!
-
వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఏ మోడళ్లపై అంటే?
-
ఆంధ్రప్రదేశ్లో ‘ఎగ్జిట్ పోల్స్’ అంచనాలివే..