Kota: నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో కోటాలో 28కి చేరిన మరణాలు
పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాది అక్కడ జరిగిన బలవన్మరణాల సంఖ్య 28కి చేరుకుంది.
కోటా: రాజస్థాన్ (Rajasthan)లోని కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 28కి చేరింది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన హుస్సేన్ అనే విద్యార్థి నీట్ (NEET)కు సిద్ధమవుతున్నాడు. శిక్షణ కోసం గతేడాది నుంచి స్థానికంగా ఓ వసతి గృహంలో ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి భోజనం చేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత గది నుంచి ఎంతకీ బయటకు రాలేదు. అనుమానంతో స్నేహితులు అతడికి ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. గది తలుపులు తెరిచారు. అక్కడ ఉరి వేసుకుని కనిపించిన ఆ విద్యార్థిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే, తన గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించలేదు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
సొరంగం వద్ద శరవేగంగా పనులు.. ఇంకా 10 మీటర్ల దూరంలో కూలీలు
పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన కోటాలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. మానసిక ఒత్తిడి కారణంగానే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారనే వాదనలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం వసతి గృహాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే విధంగా శిక్షణ ఇవ్వడం.. విద్యార్థుల మరణాలను నియంత్రించేందుకు భవనాల చుట్టు ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్ ఫ్యాన్లను అమర్చారు. అయినా సరే.. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం కలవరపెడుతోంది. గతేడాది 15 మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 28 మంది ప్రాణాలు తీసుకోవడం బాధాకరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు