Jayalalithaa: ‘ప్రజల వల్లే నేను..’ జయలలిత ‘ఆడియో సందేశం’ వైరల్‌..!

తమిళనాడు ప్రజలను ఉద్దేశించి మాజీ సీఎం దివంగత జయలలిత ‘ఆడియో సందేశం’ వైరల్‌గా మారింది.

Published : 25 Feb 2024 02:02 IST

చెన్నై: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Election) సమీపిస్తోన్న వేళ.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే దిగ్గజ నేత దివంగత జయలలిత (Jayalalithaa) ఆడియో సందేశం వైరల్‌గా మారింది. అయితే.. ఇది ‘కృత్రిమ మేధ (Artificial Intelligence)’ మాయ కావడం గమనార్హం. జయలలిత 76వ జయంతి సందర్భంగా ‘ఏఐ’ సాయంతో రూపొందించిన ఆమె తమిళ ప్రసంగాన్ని పార్టీ శనివారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. 

ఆరు ట్రంకు పెట్టెలను తెచ్చుకోండి.. జయలలిత బంగారు ఆభరణాలను తీసుకెళ్లండి!

రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేస్తూ.. ప్రజాపాలన స్థాపనలో భాగంగా ఎడప్పాడి పళనిస్వామికి మద్దతు ఇవ్వాలని ఆమె రాష్ట్ర ప్రజలను కోరుతున్నట్లు ఆడియో సందేశంలో ఉంది. ‘‘నేను ప్రజల వల్లే ఉన్నాను. నేను ప్రజల కోసమే ఉన్నాను’’ అంటూ తనదైన ప్రసిద్ధ పదబంధాన్ని వినియోగించారు. ఈ సందర్భంగా పార్టీ ఎన్నికల నినాదాన్ని కూడా పళనిస్వామి విడుదల చేశారు. ‘‘తమిళ హక్కులను తిరిగి పొందుదాం- తమిళనాడును కాపాడుకుందాం’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు