Akhilesh Yadav: ‘పీడీఏ’నే ప్రధాన అస్త్రంగా.. భాజపాపై అఖిలేశ్ పిడుగులా..!
లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ సత్తా చాటింది. దీని వెనుక పార్టీ అధినేత అఖిలేశ్ పాత్ర సుస్పష్టం.
లఖ్నవూ: గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు పెద్ద సంఖ్యలో ఎంపీలను అందించిన ఉత్తర్ప్రదేశ్లో ఈసారి ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2019 ఎన్నికల్లో సొంతంగా 62 సీట్లు గెలుపొందిన కాషాయ పార్టీ.. ఈసారి వాటిలో ఏకంగా 29 స్థానాల్లో వెనుకంజలో ఉండటం గమనార్హం. ప్రధానంగా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ.. కమలదళం సీట్లకు భారీగా గండికొట్టినట్లు తెలుస్తోంది. 2019లో ఒక్కసీటుకే పరిమితమైన కాంగ్రెస్ సైతం ఈసారి 6 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్థానికంగా ఎంపీగా ఉండటం, అధికార రాష్ట్రం కావడంతో.. యూపీని క్లీన్ స్వీప్ చేస్తామని ప్రకటించిన కమలదళానికి ఈ లెక్కలు మింగుడుపడని వ్యవహారంగా మారినట్లు తెలుస్తోంది.
2014, 2019 లోక్సభ ఎన్నికల్లో 5 చొప్పున విజయాలకే పరిమితమైన ఎస్పీ.. ఈసారి ఏకంగా దాదాపు 37 సీట్లకు ఎగబాకడం వెనుక అఖిలేశ్ పాత్ర సుస్పష్టం. మొత్తం 80 స్థానాల్లో కాంగ్రెస్కు 18 సీట్లు, టీఎంసీకి ఒక స్థానాన్ని కేటాయించి, మిగిలిన చోట్ల తన అభ్యర్థులను నిలబెట్టారు. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ మరణానంతరం జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఈ క్రమంలోనే ఎస్పీ చరిత్రలోనే తొలిసారి అత్యధిక ఎంపీ సీట్లు సాధించారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, అఖిలేశ్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ‘‘దో లడ్కోకీ జోడీ (ఇద్దరు యువకుల జోడీ), దో శహజాదే (ఇద్దరు యువరాజులు)’’గా పదేపదే ఎద్దేవా చేసినప్పటికీ.. వారిద్దరూ సత్తా చాటారు.
మోదీ, అమిత్ షాలను ప్రజలు తిరస్కరించారు: రాహుల్ గాంధీ
‘‘2024 లోక్సభ ఎన్నికల్లో ‘పిచ్డే (వెనుకబడిన వర్గాలు), దళితులు, అల్పసంఖ్యాక వర్గాల(PDA)’దే హవా అంటూ అఖిలేశ్ ప్రచార పర్వంలో దూకారు. ఓ వర్గం ఓట్లనూ గణనీయంగా రాబట్టినట్లు సమాచారం. ప్రతిపక్షాలపై అణచివేతకు పాల్పడుతోందంటూ భాజపాపై విరుచుకుపడ్డారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్, జేఎంఎం నేత హేమంత్ సోరెన్లను జైల్లో పెట్టడాన్ని ఖండించారు. వారసత్వ, కుటుంబ రాజకీయాల ఆరోపణలను తిప్పికొట్టారు. ఎన్నికలకు ముందు విబేధాలను పక్కనపెట్టి బాబాయి శివ్పాల్ సింగ్ యాదవ్తో సయోధ్య కుదుర్చుకున్నారు. పార్టీ సాంప్రదాయ ఓటర్లను కాపాడుకోవడంలో ఇది సాయపడింది. 2019లో బీఎస్పీతో కలిసి పోటీ చేసినప్పటికీ.. ఈసారి దూరంగా ఉన్నారు. అయితే, ఎన్నికల ఫలితాలపై దీని ప్రభావం ఏ మాత్రం లేనట్లు కనిపిస్తోంది. ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ ఒక్కసీటూ గెలవలేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు