INDIA: విపక్ష సభ్యుల సస్పెన్షన్.. మిగిలింది 43 మందే!
ఉభయ సభల్లో కలిపి మొత్తం 141 మంది సస్పెన్షన్కు గురికాగా.. వీరిలో 95 మంది లోక్సభ సభ్యులు, 46 మంది రాజ్యసభకు సభ్యులున్నారు. తాజా చర్యలతో ప్రస్తుత సెషన్లో లోక్సభలో (Lok Sabha) విపక్షాల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో (Parliament) సభ్యుల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఉభయ సభల్లో కలిపి మొత్తం 141 మంది సస్పెన్షన్కు గురయ్యారు. వీరిలో 95 మంది లోక్సభ సభ్యులు, 46 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఈ చర్యలతో ప్రస్తుత సెషన్లో లోక్సభలో (Lok Sabha) విపక్షాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ముఖ్యంగా విపక్షాల కూటమి ఇండియా (INDIA)లో మూడింట రెండొంతుల బలం తగ్గిపోయినట్లయ్యింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా కేవలం తొమ్మిది మంది మాత్రమే కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో (Winter session) మిగిలిపోయారు. భారత పార్లమెంటు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడటం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.
లోక్సభలో 95 మంది..
సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంగా శీతాకాల సమావేశాలు ముగిసే వరకు పలువురు విపక్ష సభ్యులపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ వెల్లడించారు. ఈ క్రమంలో డిసెంబర్ 14న 13 మంది, 18న 33 మంది, 19న మరో 45 మందిపై వేటు వేశారు. దీంతో మొత్తంగా సస్పెన్షన్కు గురైన లోక్సభ సభ్యుల సంఖ్య 95కు చేరింది. అటు రాజ్యసభలోనూ ఒక్కరోజే 45 మందిపై చర్యలు తీసుకున్నారు.
కూటమిలో అధికం..
ఇండియా కూటమికి లోక్సభలో 138 సభ్యుల బలం ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 43కి తగ్గిపోయింది. తృణమూల్ కాంగ్రెస్కు 22 మంది ఎంపీలు ఉండగా.. అందులో 13 మంది సస్పెన్షన్కు గురయ్యారు. డీఎంకేకు 24 మంది ఉండగా, 16 మంది సభ్యులపై వేటు పడింది. ఆమ్ఆద్మీ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న ఒకే ఒక్క ఎంపీ సుశీల్ కుమార్ రింకూ కూడా సస్పెన్షన్కు గురయ్యారు. ఎన్సీపీకి నలుగురు ఎంపీలు ఉండగా.. అందులో శరద్ పవార్ వర్గానికి చెందిన సుప్రియా సూలేతో సహా ముగ్గురిపై వేటు పడింది.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు చెందిన ముగ్గురు, వీసీకే, ఆర్ఎస్పీకి చెందిన ఒక్కో ఎంపీ, సమాజ్వాదీ పార్టీకి చెందిన ఇద్దరు (మొత్తం ముగ్గురు), సీపీఎం నుంచి ఇద్దరు (మొత్తం ముగ్గురు సభ్యులు), సీపీఐకి ఇద్దరు సభ్యులుండగా అందులో ఒకరిపై వేటు పడింది. బీఎస్పీకి చెందిన డానిష్ ఆలీ ఇటీవల సస్పెన్షన్కు గురయ్యారు. అయితే, బీఎస్పీ మాత్రం ఇండియా కూటమిలో లేదు. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్న శివసేన (యూబీటీ)కు ఆరుగురు ఎంపీలుండగా.. ఇందులో ఎవ్వరూ సస్పెన్షన్కు గురికాలేదు.
రాజ్యసభలోనూ..
రాజ్యసభలోనూ సభ్యులపై చర్యలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 14న ఒకరిపై వేటు పడగా.. సోమవారం (18వ తేదీన) ఒకేసారి 45 మందిపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. 45 మందిలో 34 మందిని శీతాకాల సమావేశాల వరకు ఈ చర్యలుంటాయని పేర్కొనగా.. మరో 11మంది ‘ప్రవర్తన’పై ప్రివిలేజెస్ కమిటీకి సిఫార్సు చేశారు. ఆ నివేదికను మూడు నెలల్లో అందజేయాలని సూచించారు. అప్పటివరకు వీరిపై సస్పెన్షన్ అమల్లో ఉండనుంది. వీరిలో సగం మంది ఇండియా కూటమికి చెందిన వారే కావడం గమనార్హం.
ఇదిలాఉంటే, లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య 543కాగా ప్రస్తుతం 522 మంది ఎంపీలున్నారు. మరో 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం సభ్యుల్లో 290 మంది భాజపా సభ్యులే. భాజపా మిత్రపక్షాలు కలిపి ఈ సంఖ్య 300 దాటుతుంది. మరోవైపు వేటు పడిన విపక్ష సభ్యుల సంఖ్య 95గా ఉంది. దీంతో దాదాపు 100 మందికిపైగా మాత్రమే ప్రతిపక్ష ఎంపీలు సభలో కొనసాగుతున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 22తో ముగియనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్