PM Modi: ‘ఏపీ తీర్పు అపూర్వం’ - ప్రధాని మోదీ ధన్యవాదాలు

ఎన్డీఏకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అపూర్వ విజయం అందించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 04 Jun 2024 20:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్డీఏకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అపూర్వ విజయం అందించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఘన విజయం సాధించినందుకు గాను చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ తోపాటు తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధితోపాటు రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచేందుకు కృషి చేస్తామని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు.

వరుసగా మూడోసారి ఎన్డీఏ కూటమిపై దేశ ప్రజలు విశ్వాసాన్ని ఉంచారని.. ఇదో చారిత్రక ఘట్టమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజల అభిమానానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు గడిచిన దశాబ్ది కాలంగా చేస్తున్న మంచి పనులను కొనసాగిస్తామన్నారు. ఈ విజయానికి కృషి చేసిన కార్యకర్తలందరికీ నమస్కరిస్తున్నానని అన్నారు.

మరోవైపు, ఒడిశా ప్రజలు కూడా అద్భుత విజయాన్ని అందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తమ సుపరిపాలనకు ఇది అఖండ విజయమన్నారు. రాష్ట్ర ప్రజల కలలను నెరవేర్చేందుకు ఏ అవకాశాన్నీ భాజపా వదులుకోదని.. అభివృద్ధిలో ఒడిశాను కొత్త శిఖరాలకు తీసుకువెళ్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు