Jammu Kashmir: ఆర్టికల్ 370.. రద్దు నుంచి సుప్రీం తీర్పు వరకు!
‘ఆర్టికల్ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court)పేర్కొంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) నిర్వహించాలని ఆదేశించింది.
దిల్లీ: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనని పేర్కొంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2019లో ఆర్టికల్ 370 రద్దు మొదలు.. అనంతరం పరిణామాలను ఓసారి పరిశీలిస్తే..
- డిసెంబర్ 20, 2018: జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు. జులై 3, 2019న దాన్ని మరోసారి పొడిగించారు.
- ఆగస్టు 5, 2019: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
- ఆగస్టు 6, 2019: ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఎం ఎల్ మిశ్రా అనే న్యాయవాది సుప్రీం కోర్టులో తొలి పిటిషన్ దాఖలు చేశారు. కొంతకాలానికి జమ్మూ కశ్మీర్కు చెందిన మరో న్యాయవాది షకీర్ షబీర్ ఆ జాబితాలో చేరారు.
- ఆగస్టు 10, 2019: స్థానిక పౌరుల ఆమోదం లేకుండా రాష్ట్ర హోదాను మార్చారని పేర్కొంటూ జమ్మూ కశ్మీర్లో ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (NC) కూడా పిటిషన్ దాఖలు చేసింది.
- ఆగస్టు 28, 2019: జర్నలిస్టులపై ఆంక్షలు తొలగించాలని కోరుతూ కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ చేసిన విజ్ఞప్తిపై కేంద్రంతోపాటు జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.
- ఆగస్టు 28, 2019: ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం సిఫార్సు చేసింది.
- సెప్టెంబర్ 19, 2019: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.
- మార్చి 2, 2020: ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
- ఏప్రిల్ 25, 2022: జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం జరుగుతోన్న కసరత్తుపై తక్షణమే విచారణ జరపాలని పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.
- జులై 11, 2023: ఆగస్టు 2 నుంచి రోజువారీ విచారణ ప్రారంభిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది.
- ఆగస్టు 2, 2023: ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది.
- సెప్టెంబర్ 5, 2023: దీనిపై దాఖలైన 23 పిటిషన్లపై 16 రోజులు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. తీర్పు రిజర్వు చేసింది.
- డిసెంబర్ 11, 2023: ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని తెలిపింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత