Jammu Kashmir: ఆర్టికల్ 370.. రద్దు నుంచి సుప్రీం తీర్పు వరకు!
‘ఆర్టికల్ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court)పేర్కొంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) నిర్వహించాలని ఆదేశించింది.
దిల్లీ: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనని పేర్కొంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2019లో ఆర్టికల్ 370 రద్దు మొదలు.. అనంతరం పరిణామాలను ఓసారి పరిశీలిస్తే..
- డిసెంబర్ 20, 2018: జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు. జులై 3, 2019న దాన్ని మరోసారి పొడిగించారు.
- ఆగస్టు 5, 2019: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
- ఆగస్టు 6, 2019: ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఎం ఎల్ మిశ్రా అనే న్యాయవాది సుప్రీం కోర్టులో తొలి పిటిషన్ దాఖలు చేశారు. కొంతకాలానికి జమ్మూ కశ్మీర్కు చెందిన మరో న్యాయవాది షకీర్ షబీర్ ఆ జాబితాలో చేరారు.
- ఆగస్టు 10, 2019: స్థానిక పౌరుల ఆమోదం లేకుండా రాష్ట్ర హోదాను మార్చారని పేర్కొంటూ జమ్మూ కశ్మీర్లో ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (NC) కూడా పిటిషన్ దాఖలు చేసింది.
- ఆగస్టు 28, 2019: జర్నలిస్టులపై ఆంక్షలు తొలగించాలని కోరుతూ కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ చేసిన విజ్ఞప్తిపై కేంద్రంతోపాటు జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.
- ఆగస్టు 28, 2019: ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం సిఫార్సు చేసింది.
- సెప్టెంబర్ 19, 2019: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.
- మార్చి 2, 2020: ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
- ఏప్రిల్ 25, 2022: జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం జరుగుతోన్న కసరత్తుపై తక్షణమే విచారణ జరపాలని పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.
- జులై 11, 2023: ఆగస్టు 2 నుంచి రోజువారీ విచారణ ప్రారంభిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది.
- ఆగస్టు 2, 2023: ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది.
- సెప్టెంబర్ 5, 2023: దీనిపై దాఖలైన 23 పిటిషన్లపై 16 రోజులు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. తీర్పు రిజర్వు చేసింది.
- డిసెంబర్ 11, 2023: ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని తెలిపింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు