Atiq Ahmad: అతీక్ రాసిన ‘రహస్య లేఖ’.. యూపీ సీఎం, సీజేఐల కోసమే!
హత్యకు గురైన గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ ‘రహస్య లేఖ’ విషయం ఉత్కంఠగా మారింది. ఏదైనా దుర్ఘటన జరిగితే, లేదా తాను హత్యకు గురైతే.. దాన్ని ఉత్తర్ప్రదేశ్ సీఎం, భారత ప్రధాన న్యాయమూర్తికి పంపాలని.. మరణానికి ముందే అతీక్ దాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం.
లఖ్నవూ: గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ (Atiq Ahmad)తోపాటు అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ను శనివారం కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ‘రహస్య లేఖ’ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకవేళ తాను మరణిస్తే.. ఆ లేఖను ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి (UP CM), భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)కి చేరవేయాలంటూ అతీక్ ముందుగానే సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆ లెటర్ (Atiq Letter)ను ఆ ఇద్దరికి పంపుతున్నట్లు అతీక్ తరఫు న్యాయవాది మంగళవారం వెల్లడించారు.
‘ఒకవేళ ఏదైనా దుర్ఘటన జరిగితే, లేదా తాను హత్యకు గురైతే.. సంబంధిత లేఖను ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తికి పంపాలని అతిక్ అహ్మద్ చెప్పారు. సీల్డ్ కవరులో ఉన్న ఆ లేఖ ప్రస్తుతం నా దగ్గర లేదు. వేరే వ్యక్తి దాన్ని చేరవేయనున్నారు. లేఖలోని విషయాలూ నాకు తెలియవు’ అని న్యాయవాది విజయ్ మిశ్రా మీడియాకు తెలిపారు. భారీ నేర సామ్రాజ్యాన్ని ఏలడంతోపాటు సుదీర్ఘ కాలం ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన అతీక్ అహ్మద్.. ఆ లేఖలో ఏం రాశాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా.. అతీక్ అహ్మద్ (60), అతని సోదరుడు అష్రఫ్లను వైద్య పరీక్షల కోసం పోలీసులు ప్రయాగ్రాజ్లోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చిచంపారు. జర్నలిస్టుల్లా వచ్చిన సన్నీ సింగ్, లవ్లేశ్, అరుణ్ మౌర్యలు ఈ హత్యలకు పాల్పడ్డారు. అతీక్ను హత్యచేసి పేరు సంపాదించాలనే లక్ష్యంతోనే కాల్పులు జరిపామని నిందితులు వెల్లడించారు. ఇందులో ప్రధాన సూత్రధారిగా సన్నీ సింగ్ను భావిస్తున్నారు. అతీక్, అతడి సోదరుడిపై కాల్పులు జరిపేందుకు మిగతా ఇద్దరిని అతడే ఒప్పించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?