Air India: గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్‌!

ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగడంతో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయిన ఘటన దిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

Published : 18 May 2024 00:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమానం గాల్లో ఉండగా.. అందులోని ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. దిల్లీ (Delhi)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం 175 మంది ప్రయాణికులతో కూడిన ఎయిరిండియా (Air India) విమానం శుక్రవారం సాయంత్రం దిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. కాసేపటికే విమానంలోని ఏసీ యూనిట్‌లో మంటలు వచ్చినట్లు హెచ్చరికలు రావడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఫ్లైట్‌ను వెనక్కి మళ్లించారు. మరోవైపు ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటించారు. చివరకు సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు విమానయాన సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు