Nitish kumar: 1.78లక్షల టీచర్ పోస్టుల భర్తీకి నీతీశ్ కేబినెట్ ఆమోదం
నీతీశ్ కుమార్ సారథ్యంలోని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 1.78లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది.
పట్నా: బిహార్(Bihar) సీఎం నీతీశ్ కుమార్(Nitish Kumar) సారథ్యంలోని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 1.78లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఉద్యోగాల్లో 85,477 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉండగా.. 1,745 మాధ్యమిక, 90,804 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా కేబినెట్ సెక్రటేరియట్ అదనపు చీఫ్ సెక్రటరీ ఎస్.సిద్దార్థ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.78లక్షల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించినట్టు వెల్లడించారు. ఈ పోస్టులను బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. అతి త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించి ఈ ఏడాది చివరి నాటికే పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. బిహార్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి మహాకూటమిగా ఏర్పడి నీతీశ్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దీంతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 30 (అర్ధరాత్రి) నుంచి గయ, ముజఫర్పూర్లలో 15 ఏళ్లు దాటిన అన్ని కమర్షియల్ వాహనాలు, డీజిల్తో నడిచే బస్సులు, ఆటోల కార్యకలాపాలను నిషేధించాలనే రవాణాశాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సిద్ధార్థ్ వెల్లడించారు. ఈ రెండు నగరాల్లో డీజిల్ బస్సులు/ఆటోల యజమానులు సీఎన్జీకి మారేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పట్నాలో ఈ విధానం అమలు చేసేందుకు రవాణాశాఖ సర్క్యులర్ జారీ చేయగా.. తాజాగా ఈ రెండు నగరాల్లోనూ అదే తరహాలో 15 ఏళ్లు దాటిన డీజిల్ బస్సులు/ఆటోల కార్యకలాపాలపై నిషేధానికి సంబంధించి తాజాగా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!