US: పక్షులు నిజమైనవి కావట.. రోబోలట!
సాంకేతికత పెరిగిన తర్వాత ఏ సమాచారమైనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మధ్య కాలంలో సంప్రదాయ సమాచార మాధ్యమాలతోపాటు సోషల్మీడియాలో బోలేడు సమాచారం లభిస్తోంది. ఈ క్రమంలో వాస్తవాలకంటే అవాస్తవ వార్తలు, ఉద్దేశపూర్వకంగా అల్లిక కట్టుకథలు.. సిద్ధాంతాలు వైరల్
ఇంటర్నెట్ డెస్క్: సాంకేతికత పెరిగిన తర్వాత ఏ సమాచారమైనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మధ్య కాలంలో సంప్రదాయ సమాచార మాధ్యమాలతో పాటు సోషల్మీడియాలో బోలెడు సమాచారం లభిస్తోంది. ఈ క్రమంలో వాస్తవాలకంటే అవాస్తవ వార్తలు, ఉద్దేశపూర్వకంగా అల్లిన కట్టుకథలు.. సిద్ధాంతాలు వైరల్ అవుతున్నాయి. భూమి గుండ్రంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించినా.. బల్లపరుపుగా ఉంటుందన్న సిద్ధాంతాన్ని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వాటిల్లో ఒకటే ‘బర్డ్స్ ఆర్ నాట్ రియల్(పక్షులు నిజమైనవి కావు)’ సిద్ధాంతం. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకున్నా.. లక్షల మంది అమెరికన్లు ఈ సిద్ధాంతాన్ని నమ్మడమే కాదు.. పక్షులను చంపొద్దని, అమెరికన్ల వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించవద్దంటూ ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించారు.
ఏంటీ.. బర్డ్స్ ఆర్ నాట్ రియల్ సిద్ధాంతం?
అమెరికాలో 1950కాలంలో అప్పటి సీఐఏ(సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని భావించిందట. భద్రతా సిబ్బంది, కెమెరాలు ఏర్పాటు చేసినా.. వాటి పరిధిలో మాత్రమే రక్షణ కల్పించగలం. అంతకు మించి నిఘా పెట్టాలంటే రోబో పక్షులను తయారు చేయాలని సీఐఏ భావించిందట. ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా.. ప్రకృతిలో మమేకమైన పక్షులను చంపేసి వాటి స్థానంలో రోబో పక్షులను వదలాలని నిర్ణయించిందట. ఇందుకోసం భారీ ఆపరేషన్ చేపట్టిందని ఈ సిద్ధాంతం చెబుతోంది.
పక్షులను చంపాల్సిన అవసరమేముంది అని అంటే.. అందుకు ఒక కారణముందట. అధికారుల ఖరీదైన కార్లపై పక్షులు రెట్టలు వేయడంతో వాటిని అంతం చేయాలని సీఐఏ సంకల్పించిందని చెబుతుంటారు. 1959 నుంచి 2001 వరకు అమెరికా వ్యాప్తంగా దాదాపు 12బిలియన్ పక్షుల్ని చంపి.. వాటి స్థానంలో రోబో పక్షుల్ని తీసుకొచ్చారని ఈ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఈ రోబో పక్షులు పవర్లైన్స్పై కూర్చొని వాటంతట అవే ఛార్జింగ్ చేసుకుంటాయని చెబుతున్నారు.
సోషల్ మీడియా.. వెబ్సైట్.. ఉద్యమం
బర్డ్స్ ఆర్ నాట్ రియల్ అనే వెబ్సైట్లో ఈ సిద్ధాంతానికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపర్చారు. అయితే, ఎలాంటి ఆధారాలు లేకున్నా.. కొన్ని కాకతాళీయమైన సందర్భాలను.. వార్తలను కలిపేసి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారని మరికొందరు వాదిస్తున్నారు. సోషల్మీడియాలోనూ ఈ సిద్ధాంతం బాగా పాపులరైంది. ఇన్స్టాలో 3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్లో వేల మంది ఈ పేజీని ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్లోనూ భారీగా స్పందన వస్తోంది. దీంతో నిజమైన పక్షులను చంపి, రోబోలను వదలడంపై ఈ సిద్ధాంతం ఫాలోవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారు.
2017లో తొలిసారి టెన్నెస్సీ లోని యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్కు చెందిన ప్రొఫెసర్ మెక్ ఇండో తొలిసారి ఓ ర్యాలీలో అమెరికాలో ఉన్నవి నిజమైన పక్షులు కావంటూ ప్లకార్డు పట్టుకొని కనిపించాడు. లాక్డౌన్ సమయంలో అంతా ఆన్లైన్మయం అయ్యేసరికి.. ఈ సిద్ధాంతం పట్ల చాలా మంది నెటిజన్లు ఆకర్షితులయ్యారు. కరోనా ఆంక్షలు సడలించడంతో ఇటీవల మిస్సోరిలోని స్ప్రింగ్ఫీల్డ్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అమెరికన్లను రోబో పక్షులు గమనిస్తున్నాయని, వ్యక్తిగత జీవితాలపై అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. దీంతో మరోసారి ఈ సిద్ధాంతం వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కమలా.. మా మద్దతు మీకే
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి