జీలం నదిలో పడవ బోల్తా.. పలువురి గల్లంతు

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో జీలం నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. 

Updated : 16 Apr 2024 10:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ప్రమాదం జరిగింది. శ్రీనగర్‌(Srinagar) సమీపంలో జీలం నది( Jhelum river)లో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. 

స్థానికుల కథనం ప్రకారం.. ఆ పడవలో పాఠశాల విద్యార్థులు సహా పలువురు ఉన్నారు. వారంతా గాంద్‌బల్‌ నుంచి బట్వారాకు వెళ్తున్నారు. ఈ ప్రమాదం నుంచి పలువురిని కాపాడగా.. గల్లంతయిన వారి సంఖ్య తెలియాల్సి ఉంది. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాల్లో నీటి ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగింది. వానలతో కొండచరియలు విరిగిపడటంతో సోమవారం జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని