Bomb threat: రాజధానిలో కలకలం.. నార్త్‌ బ్లాక్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌

దేశ రాజధానిలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా నార్త్‌ బ్లాక్‌కు బెదిరింపు మెయిల్‌ వచ్చింది.

Published : 22 May 2024 17:56 IST

దిల్లీ: దేశ రాజధానిలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా నార్త్‌ బ్లాక్‌కు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఇందులోనే ఉంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు.

నార్త్‌ బ్లాక్‌లోని పోలీస్‌ కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్‌ బెదిరింపు వచ్చింది. ఈ విషయాన్ని ఆయన దిల్లీ ఫైర్‌ సర్వీస్‌ (DFS)కు తెలియజేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితోపాటు డాగ్‌ స్క్వాడ్‌, బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఎటువంటి అనుమానిత వస్తువులు గుర్తించలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని