తమ్ముడి మరణం.. అన్నయ్య చెదరని సంకల్పం!
కరోనా విపత్కర పరిస్థితుల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అప్పటి వరకు కళ్లెదుట తిరిగిన వాళ్లే కరోనాకు బలవుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త
ఇంటర్నెట్డెస్క్: కరోనా విపత్కర పరిస్థితుల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అప్పటి వరకు కళ్లెదుట తిరిగిన వాళ్లే కరోనాకు బలవుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తోందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సమయానికి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే.. ఆస్పత్రి మెట్లు ఎక్కకుండానే మృత్యు ఒడికి చేరుతున్న వారెందరో..! అలాంటి వారికి సాయం చేయడానికి, సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు నిలబెట్టడానికి ఓ యువకుడు ముందుకొచ్చాడు. పేదవారి కోసం రెండు అంబులెన్స్లు ఏర్పాటు చేసి.. భయం లేదు.. నేనున్నా అని భరోసా ఇస్తున్నాడు. ఆకలితో అలమటిస్తున్న ఎంతోమందికి అన్నం పెడుతున్నాడు. ఇంతకీ ఆయనెవరు? ఆయన్ను ఆ దిశగా పురిగొల్పిన సంఘటన ఏంటి..?
తమిళనాడులోని విరుద్నగర్... రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎవరైనా సాయం చేసి ఆస్పత్రికి తీసుకెళ్తే బతికే వాడేమో..? కానీ, సమయానికి అంబులెన్స్ రాలేదు. ఫలితం.. ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఈ ఘటన 2008లో జరిగింది. ఆ మృతుడి అన్నయ్యే పృథ్వీరాజ్. ఈ ఘటనతో చలించిపోయాడు. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తమ్ముడిని తీసుకెళ్లలేకపోయానే అనే బాధతో కుమిలిపోయాడు. మారుమూల ప్రాంతంలో ఉండటం వల్లే ఇలా జరిగిందని.. ముఖ్యంగా తనలాంటి పేద ప్రజలకు ఇలాంటి పరాభవం ఎదురుకాకూడదని గట్టిగా అనుకున్నాడు. కానీ, ఆర్థిక పరిస్థితులు అతడి ముందరికాళ్లకు బంధం వేశాయి. అప్పటికి ఇంకా కళాశాల విద్యనభ్యసిస్తుండటంతో ఏమీ చేయలేకపోయాడు. కానీ, తన సంకల్పాన్ని మాత్రం విడిచిపెట్టలేదు.
జీతంలో సగం పొదుపు చేసి..
చదువు పూర్తయిన తర్వాత 2011లో విలేజ్ అడ్మినిస్ట్రేషన్లో ఓ ఉద్యోగం సంపాదించాడు. గౌరవప్రదమైన వేతనం. ఉద్యోగంలో చేరిన మొదట్నుంచీ దాదాపు 50 శాతం డబ్బును పొదుపు చేసేవాడు. ఇలా రూ. 1,80,000 మొత్తాన్ని పోగు చేశాడు. దీంతో ఓ పాత ఓమ్నీ వాహనం కొని చిన్నపాటి మార్పులు చేసి అంబులెన్స్గా మార్చాడు. అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు ఓ మెడికల్ కిట్ను కూడా సమకూర్చుకున్నాడు. చుట్టుపక్కల 40 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ నుంచి ఫోన్ చేసి అవసరమని చెప్పినా.. నిమిషాల వ్యవధిలో అక్కడుండేవాడు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఎంతో మంది ప్రాణాలు నిలిపాడు. ఆయన సేవలు అలా జిల్లా మొత్తం వ్యాపించాయి. ఫోన్లు కూడా ఎక్కువగా వస్తుండేవి. దీంతో ఓ శిక్షణ కలిగిన డ్రైవర్ను పెట్టుకొని సేవలు కొనసాగించాడు.
ఎన్జీవో ఏర్పాటు
ఆయన సేవలను మెచ్చి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, స్నేహితులు సాయం చేయడం మొదలు పెట్టారు. తన సేవలను మరింత విస్తృతం చేయడం కోసం ‘రాజేష్ ఉధవమ్ కరంగల్’ పేరిట ఓ ఎన్జీవోను స్థాపించాడు. తన ఇంటికి కొన్ని మార్పులు చేసి గూడు లేని వాళ్లకు అక్కడ ఆశ్రయం కల్పించడం, అన్నదానం చేయడం తదితర కార్యక్రమాలు మొదలు పెట్టాడు. దాదాపు 15 మంది వాలంటీర్లు వీరికి సాయంగా ఉంటారు. సేవలు మరింత విస్తరించాలనే ఉద్దేశంతో దాతలు ఇచ్చిన సొమ్ముతో ఓ పాత వ్యాన్ను కొనుగోలు చేసి, అంబులెన్స్గా మార్చాడు. పృథ్వీరాజ్ సేవలు మెచ్చి కొందరు డాక్టర్లు, నర్సులు ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆయన దగ్గర ఐదుగురు వాలంట్లీర్లు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ నుంచి ఫోన్ వచ్చినా వెంటనే వారు స్పందిస్తారు. పేదవారి దగ్గర ఎలాంటి రుసుము తీసుకోరు. ఆర్థికంగా కాస్త ఫర్వాలేదు అనుకుంటే వాళ్లకు నచ్చినంత ఇవ్వొచ్చు. దీనిని ఎన్జీవో నిర్వహణకు, పెట్రోలు ఖర్చుల కోసం వినియోగిస్తారు.
కరోనాను ఎదిరించి మరీ..
ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పృథ్వీరాజ్ అందరికీ ఆపన్న హస్తం అందిస్తున్నాడు. ఎంతో మంది సకాలంలో అస్పత్రికి చేరక కన్నుమూస్తున్న తరుణంలో వారందరికీ బాసటగా నిలుస్తున్నాడు. ‘‘ ఉత్నతాధికారుల అనుమతితో పీపీఈ కిట్లు ధరించి నాతోపాటు ఐదుగురు వాలంటీర్లు కూడా మారుమూల ప్రాంతాల నుంచి కొవిడ్ బాధితులను ఆస్పత్రులకు చేరుస్తున్నాం.’’ అని పృథ్వీరాజ్ చెబుతున్నారు. కరోనా మహమ్మారి ఎంతో మందికి ఉపాధిని దూరం చేసింది. తినడానికి తిండిలేక అల్లాడుతున్న వారెందరో.. అలాంటి వారికి కూడా పృథ్వీరాజ్ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. గత ఏడాది నుంచి ప్రతి రోజూ 120 మందికి ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. నిత్యాన్నదానం కోసం ఇప్పటికి 500 మంది దాతలు ఆర్థిక సాయం చేస్తురని, ఎవరైనా దాతలు ముందుకొస్తే సేవలను మరింత విస్తృతం చేస్తామని పృథ్వీరాజ్ అంటున్నారు. ఆ రోజు సకాలంలో వైద్యం అందక తన తమ్ముడు మరణించాడనీ, అలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నానని పృథ్వీరాజ్ చెబుతున్నారు... ఆయన ఆలోచన.. ఆశయం ఎంత గొప్పవో కదా..!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం