Budget: మధ్యంతర పద్దు మురిపిస్తుందా?
కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఊరిస్తున్నవేళ ఈ పద్దులో మోదీ సర్కారు జనాకర్షక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా..?
కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ (Union Budget 2024) సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఊరిస్తున్నవేళ ఈ పద్దులో మోదీ సర్కారు జనాకర్షక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా..? వాటి జోలికి వెళ్లకుండా మూలధన వ్యయం పెంపు ద్వారా ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకే ప్రాధాన్యమిస్తుందా..? లేదంటే సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో సమతుల్యత పాటిస్తుందా..? ఇలాంటి ప్రశ్నలపై అంతటా విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. తాత్కాలిక పద్దే అయినా ఎన్నికల ఏడాది కాబట్టి కేంద్రం తమపై ఎంతో కొంత కరుణ చూపుతుందని వివిధ వర్గాలు ఆశగా ఎదురుచూస్తుండగా.. ఆర్థిక స్థిరీకరణకే సర్కారు పెద్దపీట వేయొచ్చని పారిశ్రామిక, వాణిజ్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.
అన్నదాతలకు మరింత అండ?
వర్షాభావంతోపాటు పలు ఇతర సమస్యలతో దేశవ్యాప్తంగా రైతన్నలు ప్రస్తుతం సతమతమవుతున్నారు. వారిని ఆదుకునేందుకు, ఆకట్టుకునేందుకు బడ్జెట్లో సర్కారు ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద ఇప్పుడు కేంద్రం అన్నదాతలకు ఏడాదికి రూ.6 వేలు (మూడు దఫాల్లో) పెట్టుబడి సాయం అందజేస్తోంది. ఆ మొత్తాన్ని రూ.9 వేలకు పెంచే అవకాశాలు ఉన్నాయని జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందరికీ కాకపోయినా మహిళా రైతులకు ఈ పెట్టుబడి సాయాన్ని రెట్టింపు చేసే అవకాశాలు కొట్టిపారేయలేమని ఇంకొందరు చెబుతున్నారు. తద్వారా మహిళా ఓటర్లను మోదీ సర్కారు తనవైపునకు తిప్పుకొనే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొంటున్నారు. ఎరువుల రాయితీలు, పంట బీమాల విషయంలోనూ రైతులకు అనుకూల ప్రకటనలు ఈ పద్దులో ఉంటాయని అంచనాలు ఉన్నాయి.
గ్రామీణుల కొనుగోలు శక్తి పెరగాలి
దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి మందగించింది. అందుకు ప్రధాన కారణం- గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోవడమే. ఏడాది క్రితంతో పోలిస్తే.. 2023 నవంబరులో గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ విక్రయాలు 9.6% తగ్గాయి. గ్రామీణుల ఆదాయం, కొనుగోలు శక్తి పెంపుపై కేంద్రం దృష్టిసారించాలి. వ్యవసాయేతర ఆదాయాన్ని పెంచుకునేలా చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించాలి. మరోవైపు- విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు పెరగాలి. పీఎం ఆవాస్ యోజన, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు ఈ దఫా బడ్జెట్లో ప్రాధాన్యం పెంచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలను ప్రకటించే అవకాశాలనూ కొట్టిపారేయలేమని పేర్కొంటున్నారు.
వృద్ధిరేటు భేష్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంక్షోభం వంటి పరిస్థితులతో అంతర్జాతీయంగా ఒడుదొడుకులున్నా.. ప్రస్తుతం భారత వృద్ధి అంచనాలు ఆశాజనకంగానే ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 7-7.3% మధ్య ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని, 2025 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మన దేశం కాంక్షిస్తోంది. అవి సాకారమవ్వాలంటే.. వివిధ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను, ‘మేకిన్ ఇండియా’ను ఇంకా ప్రోత్సహించాలి. వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయాలి. రిటైల్ ద్రవ్యోల్బణం 2023 డిసెంబరులో 5.7%ను తాకింది. దానికి కళ్లెం వేసే చర్యలు చేపట్టాలి.
వేతన జీవికి ఊరట?
ఆదాయపు పన్ను స్లాబుల్లో ఈ దఫా పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చన్నదే ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం. అయితే అల్ప, మధ్యాదాయ వేతన జీవులకు ఊరట కల్పించేలా ప్రామాణిక తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్) పరిమితిని రూ.లక్షకు పెంచొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిమితి అయిదేళ్లుగా రూ.50 వేలుగానే ఉంది. ద్రవ్యోల్బణం పెరిగినా ఇన్నాళ్లూ దాన్ని కేంద్రం సవరించలేదు.
రైల్వేకు మరింత జోష్!
కొన్నేళ్లుగా రైల్వే ఆధునికీకరణకు కేంద్రం పెద్దపీట వేస్తోంది. సరకు రవాణా నడవాల ఏర్పాటు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులను వేగంగా చేపడుతూ.. క్రమంగా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతోంది. అదే పంథాను కొనసాగిస్తూ.. మరిన్ని ఆధునిక, వందేభారత్, హైస్పీడ్ రైళ్లను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. రైల్వేలో మూలధన వ్యయం తగ్గకుండా చూసేందుకు తాత్కాలిక పద్దులోనే ఏకంగా రూ.2.8-3 లక్షల కోట్ల వరకు ఆ శాఖకు కేటాయించొచ్చనీ అంచనాలు వెలువడుతున్నాయి.
‘భవిష్యత్తు’ను మరవొద్దు
భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి ఊపు తీసుకురాగల సమర్థత ఉన్న పునరుత్పాదక ఇంధనాలు, ఫిన్టెక్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆరోగ్య సేవలు-బీమా, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) వంటి రంగాలకు బడ్జెట్లో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెరిగేలా చూడాలి. భారత ఎగుమతుల్లో దాదాపు 40% వాటా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఉత్పత్తులదే. ఆ రంగంలోనివారికి రుణ వెసులుబాట్లు పెంచాలి.
మూలధన వ్యయం పెంపు?
గత అయిదేళ్లలో ప్రభుత్వ మూలధన వ్యయం దాదాపు మూడు రెట్లు పెరిగింది. దేశంలో మౌలిక వసతుల కల్పన ఊపందుకుంది. పీఎం గతిశక్తి పథకంతో పలు ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకున్నాయి. రోడ్డు, రైలు నెట్వర్క్ బాగా విస్తరించింది. అదే బాటలో మౌలిక వసతులపై మూలధన వ్యయం పెంపునకు మోదీ సర్కారు మధ్యంతర పద్దులోనూ మొగ్గుచూపొచ్చు! మూలధన వ్యయం పెరిగితే జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ప్రస్తుతం మన దేశంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.9%గా ఉంది. 2025-26 కల్లా దాన్ని 4.5%కు తగ్గించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. 2023-24లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. బడ్జెట్లో విధించుకున్న లక్ష్యాలను మించడం సర్కారుకు సంతోషాన్నిచ్చేదే.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం