Road Accident : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది సజీవ దహనం

యూపీ(Uttar Pradesh)లో ఓ జాతీయ రహదారిపై కారు-ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు.

Updated : 10 Dec 2023 11:06 IST

బరేలి: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బరేలీ వద్ద జాతీయ రహదారిపై కారు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి 8 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ప్రమాద సమయంలో కారు సెంట్రల్‌ లాక్‌ పడటంతో అందులో ఉన్నవారు బయటకు రాలేకపోయారని స్థానికులు చెబుతున్నారు. వీరంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టినట్లు బరేలీ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సుశీల్ చంద్ర భాన్ ధులే తెలిపారు. ట్రక్కు డ్రైవర్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు