EC: కార్పూలింగ్.. ప్లాస్టిక్ కట్టడి.. పర్యావరణహిత ఎన్నికలకు ‘ఈసీ’ పిలుపు
ప్రచారం, ఎన్నికల నిర్వహణలో కాగితం వినియోగం తగ్గింపు, కర్బన ఉద్గారాల కట్టడి తదితర అంశాల్లో పార్టీలు, అధికార యంత్రాంగానికి ‘ఈసీ’ కీలక సూచనలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఎన్నికల సందడి (Lok Sabha Elections) మొదలైంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు సభలు, రోడ్ షోలు, ఇంటింటికి తిరుగుతూ.. అధికార, విపక్ష పార్టీలు ప్రచార జోరు పెంచనున్నాయి. ఈ క్రమంలోనే కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు ఇతరత్రా రూపాల్లో పెద్దఎత్తున ప్రచార సామగ్రి వాడకంలోకి రానుంది. ఎన్నికల, రాజకీయ కార్యకలాపాలకు వాహనాల వినియోగం కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే పర్యావరణహిత పోలింగ్ నిర్వహణకు ఈసీ (Election Commission) పిలుపునిచ్చింది. వ్యర్థాల నిర్వహణ, కాగితం వినియోగం తగ్గింపు, కర్బన ఉద్గారాల కట్టడి విషయంలో అధికార యంత్రాంగం, పార్టీలకు కీలక సూచనలు జారీ చేసింది.
‘‘ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్, పాలిథిన్ వినియోగాన్ని పూర్తిగా నివారించి, ప్రత్యామ్నామాలు ఎంచుకోవాలి. వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్వహణ విషయంలో తగు చర్యలు అవసరం. ఓటర్ల జాబితా ఇతరత్రా సామగ్రి విషయంలో కాగితం వినియోగాన్ని తగ్గించి, పేపర్కు రెండువైపులా ప్రింటింగ్ అవకాశాలను పరిశీలించాలి. సమాచార మార్పిడి కోసం ఆన్లైన్ విధానం మేలు. కార్పూలింగ్ (ఒకే వాహనంలో పలువురు ప్రయాణించడం), ప్రజారవాణా వినియోగాన్ని పెంచడంతోపాటు ఓటర్లకు ప్రయాణ దూరాన్ని తగ్గించేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రచార కార్యక్రమాల్లో పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి’’ అని ఈసీ సూచించింది.
ఉద్గారాలను లెక్కగట్టి.. చెట్లను నాటి..
- పర్యావరణహిత ఎన్నికల దిశగా గతంలో ప్రయత్నాలు జరిగాయి. శ్రీలంకకు చెందిన శ్రీలంక పొదుజన పెరమున పార్టీ 2019లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా ప్రచారం చేపట్టింది. ఎన్నికల సమయంలో ఉపయోగించిన వాహనాలు, విద్యుత్ వినియోగానికి సంబంధించిన కర్బన ఉద్గారాలను లెక్కగట్టింది. అనంతరం ప్రజల భాగస్వామ్యంతో చెట్లను నాటడం ద్వారా నష్టాన్ని భర్తీ చేసింది.
- 2019 సార్వత్రిక సమరం సమయంలో కేరళ హైకోర్టు స్థానికంగా ప్రచారంలో ఫ్లెక్సీలు, నాన్-బయోడిగ్రేడబుల్ సామగ్రిపై నిషేధం విధించింది. దీంతో పార్టీలు గోడలపై రాతలు, పేపర్ పోస్టర్లను ప్రత్యామ్నాయాలుగా ఎంచుకున్నాయి.
- తిరువనంతపురంలో ‘హరిత’ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం కృషి చేసింది. కార్యకర్తలకు గ్రామాల్లో శిక్షణా సమావేశాలు నిర్వహించింది. 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పర్యావరణహిత సామగ్రితో రూపొందించిన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) దాదాపు 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని రాహుల్ గాంధీ ఆరోపించారు. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
Delhi Commission for Women: దిల్లీ మహిళా కమిషన్లో 223 మంది ఉద్యోగులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేటు వేశారు. వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించారు. -
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..