Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండింగ్.. ఆ ‘17 నిమిషాలు’ టెన్షన్ టెన్షన్..!
జాబిల్లి ఉపరితలంపై మన ల్యాండర్ అడుగుపెట్టే క్రమంలో చివరి క్షణాలు అత్యంత కీలకమైనవని ఇస్రో అధికారులు చెబుతున్నారు. దాన్ని ‘17 నిమిషాల టెర్రర్’గా అభివర్ణిస్తున్నారు.
బెంగళూరు: జాబిల్లి (Moon)పై మన వ్యోమనౌక అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్ భారతీయులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చంద్రుడిపై పరిశోధనలకు రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 (Chandrayaan-3) లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఆ అపరూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువైంది. అయితే ఇది సాఫ్ట్ ల్యాండింగ్ (Soft Landing) అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు (17 Minutes of Terror) అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్ను నిరంతర తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో తెలిపింది. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం సుమారు 5.45 గంటల తర్వాత ఈ ప్రక్రియ మొదలుకానున్నట్లు అంచనా వేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ‘17 నిమిషాల టెర్రర్’గా ఇస్రో అధికారులు, నిపుణులు పేర్కొన్నారు.
ఈ ప్రక్రియ పూర్తిగా స్వతంత్రమైనది. సరైన ఎత్తులో సరైన సమయంలో, సరిపడా ఇంధనాన్ని వినియోగించుకుని ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సురక్షిత ల్యాండింగ్ కోసం సరైన ప్రదేశాన్ని స్కాన్ చేసుకుంటుంది. ఇదంతా ల్యాండర్ స్వయంగా చేసుకోవాల్సిందే.
ల్యాండింగ్ ప్రక్రియ ఇలా..
- ల్యాండర్ మాడ్యూల్లో పారామీటర్లు అన్నింటినీ తనిఖీ చేసి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలో నిర్దేశించుకున్న తర్వాత బెంగళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ నుంచి ఇస్రో సంబంధిత కమాండ్లను ల్యాండర్ మాడ్యూల్కు అప్లోడ్ చేస్తుంది. షెడ్యూల్డ్ ల్యాండింగ్కు రెండు గంటల ముందు ఇది జరుగుతుంది.
- సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చంద్రుడి ఉపరితలానికి 30 కి.మీల ఎత్తులో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశలోకి అడుగుపెడుతుంది. ఇక్కడి నుంచి చివరి 17 నిమిషాలు చాలా ఉత్కంఠగా కొనసాగుతాయి.
- జాబిల్లి ఉపరితలానికి చేరువయ్యేందుకు ల్యాండర్ తన నాలుగు ఇంజిన్లను మండించుకుంటుంది. ఆ తర్వాత క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంటుంది. ల్యాండర్ కుప్పకూలకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. జాబిల్లి గురుత్వాకర్షణకు అనుగుణంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
- జాబిల్లి ఉపరితలానికి వెళ్లే సమయంలో ల్యాండర్ వేగం సెకనుకు 1.68 కి.మీలుగా ఉంటుంది. ఒక విమానం వేగం కంటే ఇది 10 రెట్లు ఎక్కువ.
- జాబిల్లి ఉపరితలానికి 6.8 కి.మీల ఎత్తుకు చేరుకున్న తర్వాత ల్యాండర్ తన రెండు ఇంజిన్లను ఆఫ్ చేసి.. మరో రెండు ఇంజిన్లనే ఉపయోగించుకుని వేగాన్ని తగ్గించుకుంటుంది. రివర్స్ థ్రస్ట్తో మరింత కిందకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది.
- అప్పటికీ ల్యాండర్ ఇంకా జాబిల్లి ఉపరితలానికి సమాంతరంగానే ఉంటుంది. దీన్ని ‘రఫ్ బ్రేకింగ్ దశ’ అంటారు. ఇదంతా 11 నిమిషాల పాటు సాగుతుంది.
- ఆ తర్వాత ల్యాండర్ ‘ఫైన్ బ్రేకింగ్ దశ’లోకి అడుగుపెడుతుంది. ఇక్కడ చంద్రయాన్-3 90 డిగ్రీలు వంపు తిరుగుతుంది. అప్పుడు చంద్రుడి ఉపరితలంపై నిలువు స్థానానికి వస్తుంది. గతంలో ఇక్కడే చంద్రయాన్-2 నియంత్రణ కోల్పోయి క్రాష్ అయ్యింది.
- అలా క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ల్యాండర్ నిలువు, అడ్డం వేగాలు సున్నాకు తగ్గుతాయి. అప్పుడు ల్యాండర్ అనువైన ప్రదేశం కోసం అన్వేషిస్తుంది.
- ఆ తర్వాత ల్యాండర్ మరింత కిందకు దిగి 150 మీటర్ల ఎత్తుకు వస్తుంది. అప్పుడు మరోసారి ల్యాండింగ్ కోసం ఎగుడు దిగుళ్లు, బండరాళ్లు లేని ప్రదేశం కోసం వెతుకుతుంది.
- అన్నీ అనుకూలంగా కన్పిస్తే రెండు ఇంజిన్ల సాయంతో ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెడుతుంది. అప్పుడు దాన్ని కాళ్లు సెకనుకు 3 మీటర్ల వేగంతో ఉపరితలాన్ని తాకుతాయి.
- ల్యాండర్ కాళ్లకు అమర్చిన సెన్సర్లు.. జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజిన్లు ఆఫ్ అవుతాయి. ఆ 17 నిమిషాల టెన్షన్కు తెరపడి ప్రయోగం విజయవంతమవుతుంది.
ల్యాండర్ జాబిల్లిపై దిగిన తర్వాత దాని ఒక తలుపు తెరుచుకుంటుంది. అందులో నుంచి రోవర్ జారుకుంటూ కిందకు వస్తుంది. ఆ తర్వాత ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తుంది. ల్యాండర్, రోవర్ మొత్తం 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తాయని ఇస్రో వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
పీవోకేపై భారత్ పట్టు కోల్పోయేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనతే కారణమని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ విమర్శలు గుప్పించారు. -
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయపన్ను విభాగం జరిపిన సోదాల్లో(Tax raids) లెక్కలోకి రాని కోట్లాది రూపాయల సొత్తు బయటపడింది. -
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. -
సీబీఐకి కొత్తగా ఇద్దరు అదనపు డైరెక్టర్ల నియామకం
సీబీఐకి ఇద్దరు అదనపు డైరెక్టర్లను కేంద్రం నియమించింది. -
ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. ఈడీ అరెస్టు చేయొద్దు: సుప్రీం కీలక తీర్పు
ED arrests: మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణ చేపడితే ఆ కేసులో నిందితులను ఈడీ అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
స్వాతీమాలీవాల్పై దాడి ఘటన.. మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ మౌనం
స్వాతీమాలీవాల్ (Swati Maliwal)పై జరిగిన దాడి గురించి మీడియా ప్రశ్నించగా.. దేశవ్యాప్తంగా పలు చోట్ల మహిళలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ వారికి ఆప్ నేత ఎదురుప్రశ్న వేశారు. -
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం.. సుప్రీం ఏమందంటే..?
ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై బయట ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టులో ఈడీ లేవనెత్తింది. దానిపై కోర్టు స్పందించింది. -
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
పౌరసత్వ సవరణ చట్టం-2019పై అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. -
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
Mumbai hoarding collapse: ముంబయిలో హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో.. 48 గంటల తర్వాత కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. -
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమలా బేనీవాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనీవాల్ కన్నుమూశారు. ఆమె వయసు 97 ఏళ్లు. -
డిజిటల్ బాటలో పయనిస్తున్నాం
భారతీయ సుప్రీంకోర్టు 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించిందని, 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలు అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు
భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరఫున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అటవీ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు
ఉత్తరాఖండ్లోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఉసురు తీస్తున్న వడగాలులు
వడగాలుల కారణంగా గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. -
భారత నావికుల విడుదలకు ఇరాన్కు వినతి
గత ఎనిమిది నెలల్లో వివిధ అభియోగాల కింద నాలుగు వేర్వేరు రవాణా నౌకలలో అరెస్టు చేసిన 40 మంది భారతీయ నావికులను విడుదల చేయాల్సిందిగా ఇరాన్ను భారత్ కోరినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. -
6.7%కు తగ్గిన నిరుద్యోగిత
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గత త్రైమాసికంలో నిరుద్యోగిత స్వల్పంగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 6.8%గా ఉన్న ఈ రేటు.. 2024 జనవరి-మార్చిలో 6.7%కు పరిమితమైందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (6)
వారణాసి లోక్సభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసే గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. -
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. -
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు
తల్లి గర్భంలో ఉన్న శిశువుకూ జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్