Assembly Polls: పోలింగ్కు సిద్ధమైన బస్తర్.. 12 స్థానాల్లో 60వేల మందితో భద్రత!
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన బస్తర్ డివిజన్లో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. 600 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు.
రాయ్పుర్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్.. అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సిద్ధమైంది. ఛత్తీస్గఢ్లోని 20 అసెంబ్లీ స్థానాలకు తొలిదశలో మంగళవారం పోలింగ్ జరగనుండగా.. ఇందులో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు బస్తర్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు.. ఈ ప్రాంతంలోనే 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ హెచ్చరికల నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వారి కదలికలను పర్యవేక్షిస్తున్నారు.
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన బస్తర్ డివిజన్లో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మొత్తం 5304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 600 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. దీంతో నిఘాను పటిష్ఠం చేసిన అధికారులు.. అక్కడ మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. ఇక్కడ 60 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 40 వేల మంది సీఆర్పీఎఫ్, 20 వేల మంది రాష్ట్ర పోలీసులు ఉన్నారు. వీరిలో మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా పనిచేసే కోబ్రా (CoBRA) యూనిట్, మహిళా కమాండోలు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు.
హెలికాప్టర్లో పోలింగ్ సిబ్బంది..
భద్రతా కారణాల దృష్ట్యా ఈ డివిజన్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 149 పోలింగ్ స్టేషన్లను స్థానిక పోలీస్ స్టేషన్, భద్రతా క్యాంపులకు తరలించారు. పోలింగ్ నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో మావోయిస్టుల కదలికలను పర్యవేక్షించనున్నారు. వీటితోపాటు బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు. 156 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందితోపాటు ఈవీఎంలను హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్నారు.
బస్తర్ ప్రాంతంలో ఎన్నికలకు దూరంగా ఉండాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నారాయణ్పుర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా నేతను మావోయిస్టులు హత్య చేశారు. 2018 ఎన్నికల సమయంలోనూ మావోయిస్టులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. దంతెవాడ జిల్లాలో ముగ్గురు పోలీస్ సిబ్బందితోపాటు దూరదర్శన్ కెమెరామెన్ మావోల దాడిలో చనిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్లో 10 మంది భద్రతా సిబ్బందిని మావోయిస్టులు పొట్టనపెట్టుకున్నారు.
ఛత్తీస్గఢ్ తొలి విడతలో 20 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 223 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇక బస్తర్లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో తొమ్మిది స్థానాల్లో ఉదయం 7 నుంచి 3గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. మిగతా మూడు స్థానాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు