Assembly Elections: సంక్షేమ పథకాలే ఆయుధంగా కాంగ్రెస్.. అభివృద్ధిపైనే భాజపా ఆశలు!
తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Assembly Elections) విడుదల కావడంతో ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Assembly Elections) విడుదలైంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారాన్ని కాపాడుకునేందుకు అధికారంలో ఉన్న పార్టీలు, ఎలాగైనా ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు (2024 General Elections) ముందు ఈ ఐదురాష్ట్రాల ఎన్నికలు రావడంతో జాతీయ పార్టీలు కూడా వీటిని మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో కాంగ్రెస్, భాజపాల పరిస్థితిని పరిశీలిస్తే..
సంక్షేమ పథకాలే ఆయుధాలుగా..
ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 90 అసెంబ్లీ స్థానాలుండగా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 71చోట్ల గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. భాజపా కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతీయ పార్టీలున్నప్పటికీ కొన్నేళ్లుగా భాజపా, కాంగ్రెస్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పాపులారిటీ, సంక్షేమ పథకాలనే నమ్ముకున్న కాంగ్రెస్.. అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోన్న భాజపా.. ఎన్నికల వ్యూహాన్ని మార్చింది. ప్రధాని మోదీతోపాటు అమిత్ షా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని ఆమ్ఆద్మీ కూడా ప్రయత్నిస్తోంది.
రాజస్థాన్లో పోటాపోటీ..
రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు భాజపా ఈసారి తీవ్ర పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలే వెల్లడించారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. రాజస్థాన్లో మాత్రం తీవ్ర పోటీ ఉందని, గెలిచే అవకాశాలున్నాయని అన్నారు. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్లో 1993 నుంచి పోలింగ్ సరళి చూస్తే.. అక్కడ ఓసారి కాంగ్రెస్, మరోసారి భాజపాలు అధికారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో భాజాపాకు అవకాశాలున్నాయనే ఊహాగానాలు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాత్రం సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీం, వంటగ్యాస్పై రాయితీ, ఆరోగ్య బీమా, సామాజిక భద్రత కింద నెలకు వెయ్యి రూపాయలు వంటి పథకాలను ప్రకటిస్తున్నారు. ఇటీవలే కులగణన చేపట్టేందుకు అవసరమైన ఆదేశాలు జారీచేసింది. కాంగ్రెస్ను వర్గపోరు వెంటాడుతుండగా.. దాన్ని అవకాశంగా మలచుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం దేశావ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చేస్తోందని ప్రస్తావిస్తోంది.
మధ్యప్రదేశ్లో పార్టీల ధీమా..
234 స్థానాలున్న మధ్యప్రదేశ్లో.. 128 మంది బలంతో భాజపా అధికారంలో కొనసాగుతోంది. గత ఫలితాల్లో తొలుత కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేసి భాజపా వైపు వెళ్లిపోయారు. దాంతో శివరాజ్సింగ్ చౌహాన్ నేతృత్వంలో కాషాయపార్టీ అధికారం చేపట్టింది. ఈసారి ఎన్నికల్లో సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హిందుత్వ ఓట్లను ఆకర్షించేందుకు సీఎం చౌహాన్ దేవాలయాలకు నిధులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే వాదన ఉంది. కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వస్తే రూ.500లకే వంటగ్యాస్, 100 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, అర్హత కలిగిన మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం వంటి హామీలు గుప్పిస్తోంది. ఓబీసీలను ఆకట్టుకోవడంతోపాటు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నమ్ముకోగా.. అటు భాజపా మాత్రం కేంద్రంతోపాటు రాష్ట్రంలో చేస్తోన్న అభివృద్ధిని ప్రధానంగా ప్రచారం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
పీవోకేపై భారత్ పట్టు కోల్పోయేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనతే కారణమని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ విమర్శలు గుప్పించారు. -
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయపన్ను విభాగం జరిపిన సోదాల్లో(Tax raids) లెక్కలోకి రాని కోట్లాది రూపాయల సొత్తు బయటపడింది. -
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. -
సీబీఐకి కొత్తగా ఇద్దరు అదనపు డైరెక్టర్ల నియామకం
సీబీఐకి ఇద్దరు అదనపు డైరెక్టర్లను కేంద్రం నియమించింది. -
ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. ఈడీ అరెస్టు చేయొద్దు: సుప్రీం కీలక తీర్పు
ED arrests: మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణ చేపడితే ఆ కేసులో నిందితులను ఈడీ అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
స్వాతీమాలీవాల్పై దాడి ఘటన.. మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ మౌనం
స్వాతీమాలీవాల్ (Swati Maliwal)పై జరిగిన దాడి గురించి మీడియా ప్రశ్నించగా.. దేశవ్యాప్తంగా పలు చోట్ల మహిళలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ వారికి ఆప్ నేత ఎదురుప్రశ్న వేశారు. -
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం.. సుప్రీం ఏమందంటే..?
ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై బయట ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టులో ఈడీ లేవనెత్తింది. దానిపై కోర్టు స్పందించింది. -
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
పౌరసత్వ సవరణ చట్టం-2019పై అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. -
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
Mumbai hoarding collapse: ముంబయిలో హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో.. 48 గంటల తర్వాత కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. -
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమలా బేనీవాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనీవాల్ కన్నుమూశారు. ఆమె వయసు 97 ఏళ్లు. -
డిజిటల్ బాటలో పయనిస్తున్నాం
భారతీయ సుప్రీంకోర్టు 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించిందని, 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలు అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు
భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరఫున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అటవీ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు
ఉత్తరాఖండ్లోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఉసురు తీస్తున్న వడగాలులు
వడగాలుల కారణంగా గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. -
భారత నావికుల విడుదలకు ఇరాన్కు వినతి
గత ఎనిమిది నెలల్లో వివిధ అభియోగాల కింద నాలుగు వేర్వేరు రవాణా నౌకలలో అరెస్టు చేసిన 40 మంది భారతీయ నావికులను విడుదల చేయాల్సిందిగా ఇరాన్ను భారత్ కోరినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. -
6.7%కు తగ్గిన నిరుద్యోగిత
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గత త్రైమాసికంలో నిరుద్యోగిత స్వల్పంగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 6.8%గా ఉన్న ఈ రేటు.. 2024 జనవరి-మార్చిలో 6.7%కు పరిమితమైందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు (6)
వారణాసి లోక్సభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసే గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. -
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. -
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు
తల్లి గర్భంలో ఉన్న శిశువుకూ జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!