Mallikarjun Kharge: మల్లికార్జున ఖర్గేకు ‘జడ్‌ ప్లస్‌’ భద్రత

కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు జడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.

Updated : 22 Feb 2024 21:31 IST

దిల్లీ: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు జడ్‌ ప్లస్‌ భద్రత (Z-plus security) కల్పించినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. ఖర్గే భద్రతకు సంబంధించి వచ్చిన నివేదికపై ఇటీవల సమీక్షించి తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇక నుంచి ఖర్గేకు సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు భద్రతగా ఉండనున్నారు. దేశంలో ప్రముఖ వ్యక్తులకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగా సమీక్షించి ఆయా వ్యక్తులకు ఎక్స్‌, వై, వై ప్లస్‌, జెడ్‌, జెడ్‌ ప్లస్‌ భద్రతను కేంద్ర హోంమంత్రిత్వశాఖ కల్పిస్తుంటుంది. ఈ భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించి తదుపరి చర్యలు చేపడుతుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని