Suicides: గుజరాత్లో మూడేళ్లలో 25వేల మంది ఆత్మహత్య.. భాజపా వైఫల్యమేనని మండిపడ్డ కాంగ్రెస్
భాజపా పాలిత రాష్ట్రమైన గుజరాత్లో మూడేళ్లలో 25వేల మంది ఆత్మహత్యల (Suicide)కు పాల్పడటం ఆందోళనకర విషయమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) పేర్కొన్నారు.
దిల్లీ: భాజపా పాలిత రాష్ట్రమైన గుజరాత్లో ఆత్మహత్యల (Suicide) రేటు అత్యధికంగా ఉండటం ఆందోళనకర అంశమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) పేర్కొన్నారు. ఈసందర్భంగా కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తీరుపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సొంత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న దారుణ మానవ విషాదంపై ప్రధాని మౌనం వహిస్తున్నారని దుయ్యబట్టారు.
‘అసెంబ్లీలో ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నివేదిక భయానక వాస్తవాలను చాటిచెబుతోంది. భాజపా హయాంలో గత మూడేళ్లలో 25వేల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో దాదాపు 500 మంది విద్యార్థులే. నిరాశ, నిస్పృహ, నిస్సహాయతలో కూరుకుపోయిన ప్రజల ముఖ చిత్రాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పురోగతి సాధిస్తోందంటూ ప్రకటించుకునే రాష్ట్రంలో ఎంతోమంది పౌరులు ఇలా బలవన్మరణాలకు పాల్పడుతుండటం ఆందోళనకర విషయం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దుష్పరిపాలనకు ఇదో ఉదాహరణ అని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం, కొత్తగా ఉపాధి అవకాశాలను సృష్టించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. ఇంతటి మానవ విషాదంపై ప్రధానమంత్రి మౌనం వహించడం దారుణమన్నారు.
ఇదిలాఉంటే, రాష్ట్రంలో ఆత్మహత్యలకు సంబంధించిన సమాచారాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వివిధ కారణాల వల్ల గత మూడేళ్లలో 25,478 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని, అందులో 495 మంది విద్యార్థులే ఉన్నట్లు తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8,307 మంది, 2021-22లో 8,614 మంది, 2022-23లో 8,557 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సభలో వెల్లడించారు. అత్యధికంగా అహ్మదాబాద్ (3,280), సూరత్ (2,862), రాజ్కోట్ (1,287) వంటి నగరాల్లోనే ఈ కేసులు నమోదయ్యాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!