D Raja: సొమ్మసిల్లిపడిపోయిన డి.రాజా.. నిలకడగా ఆరోగ్యం

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా చెన్నైలో సొమ్మసిల్లిపడిపోయారు. హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Published : 25 Jul 2023 20:25 IST

చెన్నై: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా(D Raja) అస్వస్థతకు గురయ్యారు. మణిపుర్‌లో పరిస్థితులను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ తమిళనాడు రాజధాని చెన్నైలో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడుతుండగా సొమ్మసిల్లిపడిపోయారు. మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డి.రాజాకు కళ్లు తిరుగుతున్నట్టుగా అనిపించి అకస్మాత్తుగా కుప్పకూలారు. దీంతో సీపీఐ కార్యకర్తలు హుటాహుటిన ఆయన్ను వాహనంలో స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రాజా తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని