18th Lok Sabha: ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే పార్లమెంటులో అడుగుపెట్టి.. లక్షల మంది తరఫున తమ గళాన్ని వినిపించే అవకాశం కొందరికే దక్కుతుంది. ఈ క్రమంలోనే తమ ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొంటూ.. దశాబ్దాల పాటు లోక్సభకు ఎన్నికవుతోన్న నాయకులు ఎందరో ఉన్నారు. ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు చట్టసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈనేపథ్యంలో 18వ లోక్సభలోనూ అడుగుపెడుతోన్న అత్యంత సీనియర్ల జాబితాను పరిశీలిస్తే..
డాక్టర్ వీరేంద్ర కుమార్.. భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్ లోక్సభలో అత్యంత సీనియర్ల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. 1996లో తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన.. వరుసగా ఎనిమిది సార్లు ఎంపీగా విజయం సాధించిన ఘనతను సొంతం చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని టికమ్గఢ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. 2019 ప్రొటెం స్పీకర్గా చేశారు. దళిత నేతల్లో ఒకరిగా ఉన్నారు. మోదీ కేబినెట్లో కేంద్ర సామాజిక న్యాయమంత్రిగా వ్యవహరించారు.
సురేష్ కొడికున్నిల్.. కేరళలో కాంగ్రెస్ దిగ్గజ నేతల్లో ఒకరు. మావెళిక్కర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎల్ఎల్బీలో పట్టా పొందిన ఆయన.. విద్యార్థి దశలోనే రాజకీయ ప్రవేశం చేశారు. 27 ఏళ్ల వయసులోనే 1989లో అదూర్ నుంచి పోటీ చేసి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ తర్వాత మవెళిక్కర నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు. తాజాగా ఎనిమిదోసారి గెలుపొందిన ఆయన 18వ లోక్సభలో అత్యంత సీనియర్లలో ఒకరిగా నిలిచారు.
- భాజపా నేతలు పంకజ్ చౌధరి (మహారాజ్గంజ్), జిగజినాగి రమేష్ చందప్పా (బీజాపుర్), ఫాగన్ సింగ్ (మాల్దా), రాధా మోహన్ సింగ్ (పుర్వి చంపారన్), మన్సుఖ్భాయ్ ధాంజీభాయ్ (భరూచ్)తోపాటు డీఎంకే నేత టీఆర్ బాలు (శ్రీపెరంబదూర్)లు లోక్సభకు ఏడుసార్లు ఎన్నికైన నేతల జాబితాలో ఉన్నారు.
- భాజపా నేతలు ఇంద్రజిత్ సింగ్, శివరాజ్సింగ్ చౌహాన్, తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బంధోపాధ్యాయలు ఆరోసారి విజయం సాధించారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఐదోసారి గెలుపొందారు. శిరోమణి అకాలీదళ్ నేత హర్సిమ్రత్ కౌర్, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్లు నాలుగోసారి ఎన్నికైనవారిలో ఉన్నారు. వీరితోపాటు అనేక మంది ఎంపీలు ఆరు, ఐదు, నాలుగు మూడుసార్లు విజయం సాధించిన వారిలో ఉన్నారు.
- 17వ లోక్సభలో అత్యంత సీనియర్ నేతలుగా ఉన్న మేనకా గాంధీ, సంతోష్కుమార్ గంగ్వార్ (75)లు ఎనిమిది సార్లు ఎంపీలుగా గెలుపొందారు. తాజా లోక్సభ ఎన్నికలకు సంతోష్ కుమార్ దూరంగా ఉండగా.. మేనకా గాంధీ ఓడిపోయారు.
గుప్తాదే రికార్డు..
- అంతకుముందు అనేకమంది దిగ్గజ నేతలు అనేకమార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించి చరిత్ర సృష్టించారు. ఇంద్రజిత్ గుప్తా.. లోక్సభకు 11 సార్లు గెలుపొందిన రికార్డు ఇప్పటికీ చెరిగిపోలేదు. సీపీఐకు చెందిన ఆయన 1960 నుంచి 2001 వరకు (1977లో మినహా) పశ్చిమబెంగాల్లో వివిధ లోక్సభ స్థానాల నుంచి 11 సార్లు ఎంపీగా గెలుపొందారు.
- భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ.. మొత్తం 10 సార్లు ఎంపీగా గెలుపొందారు. బలరాంపుర్, గ్వాలియర్, దిల్లీ నుంచి ఎంపీగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత ఐదు పర్యాయాలు (1991-2009) లఖ్నవూ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
- యూపీఏ-1 ప్రభుత్వ సమయంలో లోక్సభ స్పీకర్గా పనిచేసిన సోమనాథ్ ఛటర్జీ.. పదిసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత పీఎం సయీద్ కూడా పదిసార్లు వరుసగా ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1967లో లక్షద్వీప్ లోక్సభ స్థానం ఏర్పాటైనప్పటినుంచి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 2005లో గుండెపోటుతో మరణించారు.
- కాంగ్రెస్ దిగ్గజ నాయకుల్లో ఒకరిగా ఉన్న కమల్నాథ్.. తన కంచుకోటగా ఉన్న ఛింద్వాడా లోక్సభ స్థానం నుంచి తొమ్మిదిసార్లు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. సమతా పార్టీ వ్యవస్థాపకుడు జార్జ్ ఫెర్నాండెజ్.. ఎనిమిది సార్లు గెలుపొందిన వారిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు