Tragedy: ‘ఈ పీడకల కన్నా చావడమే మేలు..’ శిమ్లాలో బాధితుల కన్నీటి వేదన!
హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా చోటుచేసుకుంటున్న ఘటనలు విషాదం రేపుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో అక్కడి స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
(ఇటీవల కులూలో పేకమేడల్లా కుప్పకూలిన ఇళ్లు- ఫైల్ ఫొటో)
శిమ్లా: ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలు(Heavy Rains), భారీ కొండచరియలు (Landslides) విరిగిపడుతున్న ఘటనలతో హిమాచల్ప్రదేశ్(Himachal Pradesh) విలవిల్లాడుతోంది. కొండచరియలు విరిగిపడి పలుచోట్ల భారీ పేకమేడల్లా కుప్పకూలుతోన్న భవంతుల దృశ్యాలు అక్కడి భయానక పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడిన ఘటన తమకు పీడకలగా మారిందని పలువురు బాధితులు వాపోతున్నారు. ఎక్కడకు వెళ్లాలో, ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి కన్నా చావడమే మేలనిపిస్తోందంటూ ప్రొమిలా అనే మహిళ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడారు.
‘‘ఆగస్టు 23న కొండచరియలు విరిగిపడటంతో మేం ఉండే భవనం ధ్వంసమైంది. నేను మా అమ్మ(75 ఏళ్లు)తో కలిసి ఉంటున్నా. ఆమె క్యాన్సర్ బారిన పడి 2016 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల భారీ వర్షాలకు నా ఉద్యోగం సైతం పోయింది. ఓ దుకాణంలో సేల్స్ గర్ల్గా పనిచేసేదాన్ని. వర్షాల కారణంగా కస్టమర్లు రాకపోవడంతో దుకాణం మూసివేశారు. ఇల్లు కూలిపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియడంలేదు. గురువారం రాత్రి నేను మా అమ్మ చికిత్సపొందుతున్న ఆస్పత్రిలోనే నిద్రపోవాల్సి వచ్చింది’’ అని ప్రొమిలా ఆవేదన వ్యక్తంచేశారు. భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న సదరు మహిళ తనకు తండ్రి గానీ, తోబుట్టువులు గానీ లేరని.. తనకు ఉన్నదల్లా అమ్మ మాత్రమేన్నారు. ఉద్యోగం కోసం తీవ్రంగా వెతుకుతున్నానని.. తన తల్లి చికిత్స కోసం చాలా డబ్బు అవసరం ఉన్నందున క్లీనింగ్ పనిచేసేందుకైనా సిద్ధంగానే ఉన్నానంటూ కన్నీటి గాథను చెప్పుకొచ్చారు.
భవనం కూలినప్పుడు భయంతో బయటకు పరుగులు తీయడంతో కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదని సుమన్ అనే మరో మహిళ విలపించారు. తాను ఇళ్లలో పనిచేస్తుంటానని.. తన కొడుకు స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానన్నారు. తమకు ఆశ్రయం లేదని.. బట్టలు కూడా పోయాయంటూ వాపోయారు. ఐదో తరగతి చదువుతున్న తన కుమారుడి పుస్తకాలు సైతం పోయాయంటూ ఆవేదన చెందారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారుల దృష్టి ఈ ప్రాంతం పడలేదని.. అందువల్ల తమ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని తెలిపారు. గురుద్వారాలో ఆహారం తింటున్నామని.. తమ బంధువుల ఇంటి నుంచే తిరుగుతున్నట్టు చెప్పారు. కానీ తమకు ఎలాంటి సాయంగానీ, తక్షణ ఉపశమనం గానీ లభించలేదన్నారు. శిమ్లాలో భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న ఘటనలతో జూన్ 24 నుంచి ఆగస్టు 24వరకు 242మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు ₹10వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ