Pinarayi Vijayan: కేరళ సీఎం విజయన్‌కు బెదిరింపు ఫోన్‌ కాల్‌

కేరళ సీఎం పినరయి విజయన్‌కు బెదిరింపు పోన్‌ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు.

Updated : 02 Nov 2023 13:22 IST

తిరువనంతపురం: కేరళ (Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan)కు బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. సీఎం విజయన్‌ను చంపేస్తానని బుధవారం సాయంత్రం రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ఫోన్‌ చేసింది మైనర్‌ బాలుడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోలీసులు మాత్రం ఈ ఫోన్‌ కాల్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. 

కొద్దిరోజుల క్రితం కేరళలోని కలమస్సేరిలో ఓ ప్రార్థనా సమావేశంలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 52 మంది గాయపడ్డారు. బాంబు పేలుళ్లకు తానే బాధ్యుడినని పేర్కొంటూ త్రిశూర్‌కు చెందిన డొమినిక్‌ మార్టిన్‌ అనే వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ క్రమంలో సీఎంకు బెదిరింపులు రావడంతో పోలీసుశాఖ ఉలిక్కిపడింది. గతంలో కూడా పలుమార్లు విజయన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని