Kejriwal: కేజ్రీవాల్కు ఎలక్ట్రిక్ కెటిల్, టేబుల్, కుర్చీ ఇవ్వండి.. జైలు అధికారులకు కోర్టు ఆదేశం
దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన సీఎం కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయనకు అవసరమైన కొన్ని వసతులు కల్పించాలని తిహాడ్ జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది.
దిల్లీ: తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు అవసరమైన కొన్ని వసతులు కల్పించాలని జైలు అధికారులను దిల్లీ కోర్టు ఆదేశించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలోఉంచుకొని ఎలక్ట్రిక్ కెటిల్తో పాటు పుస్తకాలు చదువుకునేందుకు వీలుగా ఒక టేబుల్, కుర్చీని ఏర్పాటుచేయాలని సూచించింది. మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఈనెల 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన్ను తిహాడ్ జైలుకు తరలించారు.
కేజ్రీవాల్ ఆరోగ్యం దృష్ట్యా జైలులో నీటిని వేడి చేసుకొనేందుకు, టీ తాగడానికి ఎలక్ట్రిక్ కెటెల్ అవసరమని ఆయన తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా తాజా ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 1న సీఎంను జైలుకు తరలించినప్పుడు ఆయనకు కుర్చీ, టేబుల్ అందించాలని జడ్జి ఆదేశించలేదని న్యాయవాది తెలిపారు. దీనిపై జడ్జి స్పందిస్తూ.. నిందితుడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఎలక్ట్రిక్ కెటిల్ అందించాలనే అభ్యర్థనను అనుమతిస్తామన్నారు. అనుమతించిన పుస్తకాలను చదివేందుకు దరఖాస్తుదారుకు టేబుల్, కుర్చీ అవసరమని చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నాకే జైలు మాన్యువల్ ప్రకారం నిందితులకు కుర్చీ, టేబుల్ అందించాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. జైలు మాన్యువల్ కాపీని కూడా కేజ్రీవాల్కు అందించేందుకు ఆథరైజ్డ్ న్యాయవాదిని అనుమతించాలని సూచించారు. మరోవైపు, కేజ్రీవాల్ భారీగా బరువు తగ్గారని ఆమ్ఆద్మీ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై తిహాడ్ జైలు అధికారులు స్పందించారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయలేదని, పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు. బుధవారం ఉదయం సీఎం తన గదిని చీపురుతో స్వయంగా శుభ్రం చేసుకున్నట్లు కనిపించారని సంబంధిత వర్గాలు సమాచారం అందినట్లుగా పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.