Jammu And Kashmir: డీజీ హత్య కేసు.. ఇంటి సహాయకుడి డైరీలో ఏముందంటే..?

జమ్మూకశ్మీర్‌లో జైళ్ల శాఖ డీజీని హత్య చేసినట్లు అనుమానిస్తోన్న ఇంటి సహాయకుడు డైరీలో  రాసుకున్న మాటలను బట్టి అతడు డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 

Updated : 04 Oct 2022 15:10 IST

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో జైళ్ల శాఖ డీజీని  హత్య చేసినట్లు అనుమానిస్తోన్న ఇంటి సహాయకుడి డైరీని పోలీసులు గుర్తించారు. అందులో అతడు తన భవిష్యత్తు, మరణం గురించి రాసిన రాతలు అతడి ఆలోచనా ధోరణిని వెల్లడిచేస్తున్నాయి. ఆ మాటలను బట్టి అతడు డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.  

యాసిర్ అహ్మద్(36) గత ఆరునెలలుగా డీజీ హేమంత్ లోహియా ఇంట్లో పనిచేస్తున్నాడు. అతడు దుందుడుకుగా ప్రవర్తించేవాడని, డిప్రెషన్‌లో ఉన్నాడని విచారణ అధికారి ఒకరు తెలిపారు. ఇక అహ్మద్‌కు సంబంధించిన డైరీలో హిందీ పాటలు ఉన్నాయని, అందులో ఒకటి ‘నన్ను మర్చిపో’ పేరిట రాసి ఉందని పేర్కొన్నారు. ‘ఓ మరణమా.. నా జీవితంలోకి రా. ప్రస్తుతం నేను నాకు నచ్చని జీవితం జీవిస్తున్నాను. ఈ జీవితం నాకు నచ్చట్లేదు. జీవితం అంటే విషాదం మాత్రమే. ప్రేమ 0 శాతం, టెన్షన్ 90 శాతం, బాధ 99 శాతం, నకిలీ నవ్వు 100 శాతం. ప్రస్తుతం నేను బతుకుతున్న జీవితంతో నాకే సమస్యా లేదు. కానీ ఇబ్బంది అంతా భవిష్యత్తు గురించే’ అని ఆ డైరీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. ప్రాథమిక దర్యాప్తులో ఉగ్రకోణం ఏమీ కనిపించలేదని, అయితే అన్ని కోణాల నుంచి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని