DMK: ప్రకటనల్లో చైనా జెండా.. వివాదంలో డీఎంకే
డీఎంకే(DMK) నేత ఒకరు ఇచ్చిన ఓ ప్రకటన వివాదాస్పదమైంది. దానిపై భాజపా(BJP) విమర్శలు గుప్పిస్తోంది.
చెన్నై: తమిళనాడు(Tamil Nadu) మంత్రి ఇచ్చిన ఒక ప్రకటన డీఎంకే-భాజపా(DMK-BJP)ల మధ్య విమర్శలకు దారితీసింది. దానిలో ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో పాటు చైనా జెండా రంగులతో ఉన్న స్పేస్ రాకెట్ దర్శనమివ్వడం తీవ్ర దుమారం రేపుతోంది.
బుధవారం ప్రధాని మోదీ(Modi) తూత్తుకుడి జిల్లాలోని కులశేఖర పట్టణంలో ఇస్రో లాంచ్ ప్యాడ్(ISRO rocket launch site)కు శంకుస్థాపన చేశారు. దీనికి ముందు ఈ శంకుస్థాపనపై తమిళనాడు మంత్రి తిరు అనితా రాధాకృష్ణన్ స్థానిక వార్తా సంస్థలకు ఒక యాడ్ ఇచ్చారు. అందులో మోదీ, స్టాలిన్, ఇతర డీఎంకే నేతలతో పాటు చైనా జాతీయజెండాతో ఉన్న రాకెట్ కూడా కనిపించింది. దీనిపై తమిళనాడు భాజపా చీఫ్ అన్నామలై సుదీర్ఘ పోస్టుతో డీఎంకేపై విరుచుకుపడ్డారు. ‘‘ఈ యాడ్ చైనాపై డీఎంకేకు ఉన్న నిబద్ధత, దేశ సార్వభౌమత్వ విస్మరణను తెలియజేస్తోంది. అవినీతిలో కొట్టుమిట్టాడుతోన్న ఈ పార్టీ.. గతంలో చేసిన తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు తహతహలాడుతోంది.’’
‘‘సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ఇప్పుడు తమిళనాడులో కాకుండా, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉందో వారికి ఈసందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నాం. ఆ లాంచ్ ప్యాడ్ గురించి అనుకున్నప్పుడు మొదటి ఛాయిస్ తమిళనాడు. అప్పటి ముఖ్యమంత్రి తిరు అన్నాదురై అనారోగ్య కారణంతో ఆ సమావేశానికి రాలేకపోయారు. ఆ స్థానంలో మథియాళగన్ రాక కోసం ఇస్రో అధికారులు ఎంతగానో వేచిచూడాల్సి వచ్చింది. ఆయన మద్యం తాగి వచ్చి గందరగోళంగా వ్యవహరించారు. 60 ఏళ్ల క్రితం మన అంతరిక్ష కార్యక్రమానికి నాటి ప్రభుత్వం ఇచ్చిన గౌరవం అది’’ అని అన్నామలై మండిపడ్డారు. ఈ యాడ్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిని కొందరు నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
చిన్నపాటి శాటిలైట్ వాహక నౌకలను అంతరిక్షంలోకి పంపేందుకు గత ఏడాది కేంద్రం కొత్త లాంచింగ్ ప్యాడ్ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరి కోట నుంచి చిన్న శాటిలైట్లను లాంచ్ చేయడం ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. అందుకే 2000 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
నీట్ పేపర్ లీక్ కాలేదు: ఎన్టీఏ
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణిని విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ సురక్షిత ప్రదేశానికి తరలించి.. సకాలంలో చికిత్స అందేందుకు సహకరించి ఆమె ప్రాణాలను నిలబెట్టింది. -
పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి
విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్ కండిషన్ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. -
కేరళ తీర ప్రాంతాన్ని ముంచెత్తిన కెరటాలు
కేరళ తీరప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో సాగర కెరటాలు విరుచుకుపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ పోకడను ‘కళ్లక్కడళ్’ అంటారు. -
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. -
పూంఛ్లో కొనసాగుతున్న ఉగ్రవేట
భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.