Earthquake: ‘హిమాచల్‌’లో భూకంపం

హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.3గా తీవ్రత నమోదైంది.

Published : 04 Apr 2024 22:27 IST

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. చంబా పట్టణంలో గురువారం రాత్రి రిక్టర్‌ స్కేలుపై 5.3 తీవ్రతతో భూమి కంపించింది. చంబా పట్టణంతో పాటు అక్కడి నుంచి దాదాపు 100 కి.మీ దూరంలో ఉన్న మనాలీలోనూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. రాత్రి సుమారు 9.30గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని