Bengaluru Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. నలుగురికి గాయాలు

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.

Updated : 01 Mar 2024 19:04 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌ (Rameshwaram Cafe)లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఇందులో ముగ్గురు సిబ్బంది, ఒక వినియోగదారుడు ఉన్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. కేఫ్‌లో మంటలు కూడా చెలరేగడంతో.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని ఆర్పేందుకు యత్నిస్తున్నారు. వైట్‌ఫీల్డ్‌ ప్రాంత పోలీసులు.. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని