Modi 3.0 Cabinet: తేనీటి విందులో.. కాబోయే మంత్రులకు మోదీ కీలక సూచనలు

కేంద్రమంత్రులుగా ప్రమాణం చేయనున్న భాజపా నేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నాయకులకు కీలక సూచనలు చేశారు.

Updated : 09 Jun 2024 15:51 IST

దిల్లీ: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భాజపా నుంచి కాబోయే మంత్రులకు తేనేటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశ అభివృద్ధి కోసం ఈ భేటీలో నేతలకు మోదీ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే బాధ్యతలపై దృష్టి సారించాలని.. దేశ అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా పనిచేయాలని మోదీ దిశానిర్దేశం చేశారు. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ప్రమాణ స్వీకారంలో మోదీతో పాటు కొందరు కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సారి ఇద్దరు మాజీ సీఎంలకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కినట్లు సమాచారం. వీరిలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని