BJP: జైలు నుంచి ముఠాలను నడుపుతారు ప్రభుత్వాలను కాదు: భాజపా

దిల్లీ ప్రభుత్వాన్ని అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచే నడిపిస్తారంటూ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత అతీషి చేసిన వ్యాఖ్యపై భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్‌ తివారీ ఘాటుగా స్పందించారు.

Published : 23 Mar 2024 13:40 IST

దిల్లీ: దిల్లీ ప్రభుత్వాన్ని అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచే నడిపిస్తారంటూ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత అతీషి(Atishi) చేసిన వ్యాఖ్యపై భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్‌ తివారీ(Manoj Tiwari) ఘాటుగా స్పందించారు.

దిల్లీ ఈ దుస్థితికి రావడానికి కారణమే కేజ్రీవాల్. ప్రజలు అతనిపై కోపంగా ఉన్నారు. అందుకే అరెస్టు చేస్తే స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్రంలో అతని ప్రభుత్వం ఏ పనీ చేయలేదు. దోచుకుని జేబులను నింపుకోవడమే వారి పని అని తివారీ మండి పడ్డారు.ముఖ్యమంత్రి అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ చేపడుతున్న నిరసనల గురించి కూడా ప్రజలు ఎక్కడా కూడా చర్చించుకోవట్లేదని అన్నారు.

‘‘చట్టం తన పని తాను చేసుకుపోతోంది...నిన్న ఆయన (అరవింద్ కేజ్రీవాల్)  తాను ముఖ్యమంత్రినని చెప్పుకున్నారు. దేశంలో  ప్రతి నేరస్థుడిని ఒకేలా చూస్తారు, అది రుజువైంది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రమేయం గురించి త్వరలో వెల్లడవుతుంది." అని దిల్లీ భాజపా అధ్యక్షుడు సచ్‌దేవా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని