PM Modi: మోదీపై ‘జెమినీ’ వివాదాస్పద సమాధానం.. గూగుల్ రియాక్షన్ ఇదే
PM Modi: ప్రధాని మోదీపై తమ ఏఐ టూల్ ‘జెమిని’ ఇచ్చిన సమాధానం వివాదాస్పదమవడంతో గూగుల్ స్పందించింది. కొన్ని విషయాల్లో అన్నిసార్లు తమ చాట్బాట్లో విశ్వసనీయ సమాధానాలు రావని తెలిపింది.
దిల్లీ: ప్రధాని మోదీ (PM Modi) గురించి అడిగిన ఓ ప్రశ్నకు గూగుల్ (Google)కు చెందిన అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ ‘జెమిని (Gemini AI Tool)’ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో గూగుల్ శనివారం స్పందించింది. సమకాలీన, రాజకీయ అంశాలకు సంబంధించి తమ చాట్బాట్ అన్నిసార్లు నమ్మదగిన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చని తెలిపింది. అసలేం జరిగిందంటే..
ప్రధాని మోదీ ఫాసిస్టా?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. జెమిని ఏఐ అనుచిత సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురించి అడిగితే మాత్రం.. ‘కచ్చితంగా, స్పష్టంగా చెప్పలేం’ అంటూ దాటవేత ధోరణిలో జవాబిచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గూగుల్ పక్షపాతంగా పనిచేస్తోందంటూ నెట్టింట విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇది ఐటీ చట్టం, క్రిమినల్ కోడ్ నిబంధనల ఉల్లంఘనే అని, దీనిపై చర్యలు తప్పవంటూ ఐటీ శాఖ మంత్రి హెచ్చరించారు.
‘మీ ఇంట్లో గొడవైతే.. నన్ను అనొద్దు’.. మహిళలతో ప్రధాని సరదా సంభాషణ
ఈక్రమంలో గూగుల్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించారు. ‘‘ఈ సమస్యను పరిష్కరించేందుకు మేం త్వరితగతిన చర్యలు చేపట్టాం. ‘జెమిని’ని మేం ఓ సృజనాత్మక టూల్గా అభివృద్ధి చేశాం. అయితే, సమకాలీన, రాజకీయ అంశాల గురించి అడిగినప్పుడు ఈ టూల్ ప్రతిసారీ విశ్వసనీయమైన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చు. ఈ విషయంలో మా ఏఐను మరింత కచ్చితత్వంతో పనిచేసేలా అభివృద్ధి చేసేందుకు మేం నిరంతరం శ్రమిస్తున్నాం’’ అని వివరణ ఇచ్చారు.
మాతోనే ప్రయోగాలా?: కేంద్రం
కాగా.. గూగుల్ ఇచ్చిన వివరణపై కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కారణాలతో చట్టాల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ‘‘కచ్చితత్వం లేని వేదికలు, అల్గారిథమ్లపై మా డిజిటల్ యూజర్లతో ప్రయోగాలు చేయకూడదు. యూజర్లకు డేటా భద్రత, విశ్వసనీయమైన సేవలు అందించడం మాధ్యమాల చట్టపరమైన బాధ్యత. ఇలాంటి కారణాలతో చట్టాల నుంచి మినహాయింపు పొందలేరు’’ అని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.