సర్వోదయ సమాజ సాధనే లక్ష్యం
‘‘భారత రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బి.ఎన్.రావు వంటి మేధావులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. వారు చూపిన బాటలో ముందడుగు వేయడమే మన బాధ్యత అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
అది మనందరి బాధ్యత
గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఈనాడు, దిల్లీ: ‘‘భారత రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బి.ఎన్.రావు వంటి మేధావులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. వారు చూపిన బాటలో ముందడుగు వేయడమే మన బాధ్యత. అందరి అభ్యున్నతి కోరిన మహాత్ముడి ఆదర్శం సర్వోదయ సమాజ సాధనే లక్ష్యం కావాలి. దేశంలో ఎంతో భిన్నత్వం ఉన్నా మనం ఒకటిగా నిలిచామంటే అది కాలపరీక్షలో నిలబడిన మన రాజ్యాంగం గొప్పదనమే’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రాత్రి జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘‘ఆర్థికరంగంలో మనం సాధించిన పురోగతి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. గతేడాది భారత్ ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఆర్థిక అనిశ్చితులు ఏర్పడినప్పుడు భారత్ ఈ ఘనత సాధించడం గమనార్హం’’ అని చెప్పారు.
కొవిడ్ను గట్టిగా ఎదుర్కొన్నాం
‘‘కొవిడ్ మహమ్మారి నాలుగో ఏట ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవృద్ధిని ఇది ప్రభావితం చేసింది. తొలినాళ్లలో భారత ఆర్థికవ్యవస్థనూ తీవ్రంగా దెబ్బతీసినా.. సమర్థవంతమైన నాయకత్వంతో దాన్ని గట్టిగా ఎదుర్కొని, త్వరగానే ఈ అగాధం నుంచి బయటపడి మనం పురోగమనం మొదలుపెట్టగలిగాం. ఇపుడు వైరస్లకు భయపడాల్సిన అవసరం లేదు. మన నాయకత్వం, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, అధికారులు, కరోనా యోధులు కలిసి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే స్థితిని కల్పించగలిగారు’’ అని రాష్ట్రపతి అభినందించారు.
ఉచిత రేషన్ చారిత్రక నిర్ణయం
‘‘ప్రభుత్వం మొదలుపెట్టిన ఆత్మనిర్భర్ భారత్కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 2020 మార్చిలో ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా ప్రభుత్వం పేదలకు కష్టకాలంలో ఆహార భద్రతను కల్పించింది. ఈ సహాయాన్ని మరింత విస్తరిస్తూ ఈ ఏడాది జనవరి నుంచి ప్రతినెలా 81 కోట్ల లబ్ధిదారులకు ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదో చారిత్రక నిర్ణయం. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి నూతన విద్యావిధానాన్ని తెచ్చుకున్నాం. డిజిటల్ ఇండియా మిషన్ గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాన్ని తొలగించగలుగుతోంది. అంతరిక్ష రంగంలో ఎన్నాళ్లనుంచో పెండింగులో ఉన్న సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రైవేటు పారిశ్రామికవేత్తలను ఇందులోకి ఆహ్వానించాం. ఇండియా మార్స్ మిషన్కు మహిళలు నేతృత్వం వహిస్తూ మన ఆడపడుచులు ఎవరికీ తక్కువకాదని నిరూపిస్తున్నారు. మహిళా సాధికారత, లింగ సమానత్వం ఇక ఎంతమాత్రం నినాదాలకే పరిమితం కాదు. ప్రజా భాగస్వామ్యంతో బేటీ బచావో, బేటీ పడావో ఉద్యమం విస్తరించింది. రాష్ట్రాల పర్యటన సందర్భంగా వివిధ విద్యాసంస్థలను సందర్శించినప్పుడు యువ మహిళలు కనబరిచిన ఆత్మవిశ్వాసం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారత కోసమూ ప్రభుత్వం కృషి చేస్తోంది.’’
జీ-20 నాయకత్వం గొప్ప అవకాశం..
‘‘విభిన్న ప్రపంచ వేదికలపై మనం తీసుకున్న చర్యలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఏడాది భారత్ జీ-20 కూటమికి నాయకత్వం వహిస్తోంది. భూతాపం పెరగటం, వాతావరణంలో తీవ్ర మార్పుల వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి భారత్ నాయకత్వం ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఐక్యరాజ్య సమితి భారత్ సూచనలను అంగీకరించి 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఎక్కువమంది వీటిని స్వీకరించడం మొదలుపెడితే పర్యావరణంతోపాటు ఆరోగ్యానికీ మంచిదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా