సంక్షిప్త వార్తలు(8)
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గురువారం జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులతో కలిసి స్మారకాన్ని సందర్శించిన ప్రధాని.. దేశసేవలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన మోదీ
దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గురువారం జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులతో కలిసి స్మారకాన్ని సందర్శించిన ప్రధాని.. దేశసేవలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ‘స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు మనం ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈసారి గణతంత్ర వేడుకలు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేళ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం’ అని మోదీ అన్నారు.
జ్ఞాన సంపన్నుల దేశంగా తీర్చిదిద్దాలి: భాగవత్
జైపుర్: ప్రజలంతా కలిసి భారత్ను జ్ఞాన సంపన్నుల దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. జైపుర్లోని కేశవ్ విద్యాపీఠ్లో గురువారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని బానిస సంకెళ్లను తెంచాలన్న దృఢ సంకల్పంతో చురుగ్గా ఉంటేనే భారత్ను జ్ఞాన సంపన్న దేశంగా మార్చగలుగుతామన్నారు. దిశానిర్దేశం లేకపోతే జ్ఞానం ప్రాణాంతకమవుతుందని, వివాదానికి కారణమవుతుందని వివరించారు. రాజ్యాంగ పరిషత్ సమగ్రంగా పరిశీలించి రూపొందించిన భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అంకితం చేస్తూ డా.బి.ఆర్.అంబేడ్కర్ పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని ప్రతిఒక్కరూ చదవాలని కోరారు. మన కర్తవ్యమేంటో డా.బి.ఆర్.అంబేడ్కర్ బోధించారని, పరస్పరం పోట్లాడుకోకుండా ప్రతిఒక్కరూ సోదరభావంతో మెలగాలని ఉద్బోధించారని తెలిపారు.
సుప్రీంకోర్టుకు చేరిన దిల్లీ మేయర్ ఎన్నిక
దిల్లీ: నిర్ణీత కాలావధిలో దిల్లీ మేయర్ ఎన్నిక జరిగేలా ఆదేశాలివ్వాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో ఆప్ పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం జరిగిన దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలోనూ గందరగోళం తలెత్తి మేయర్ ఎన్నిక జరగకపోవడంతో ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
టెక్సాస్ మేధావుల సంఘానికి ఉపాధ్యక్షుడిగా గణేశ్ ఠాకుర్
హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన అత్యుత్తమ శాస్త్రజ్ఞులు, పరిశోధకులతో కూడిన టెక్సాస్ అకాడెమీ ఆఫ్ మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ (టామెస్ట్) సంస్థ ఉపాధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన గణేశ్ ఠాకుర్ నియమితులయ్యారు. టామెస్ట్ బోర్డు డైరెక్టర్లు మంగళవారం ఆయన నియామకానికి ఆమోదముద్ర వేశారు. ఠాకుర్ 2025లో ఆ సంస్థకు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ఏప్రిల్ 27న తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం
దేహ్రాదూన్: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 27న ఉదయం 7.10 గంటలకు తెరవనున్నారు. వసంత పంచమి సందర్భంగా గురువారం బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చలికాలం మంచు కురుస్తున్న నేపథ్యంలో ఈ క్షేత్రాన్ని గతేడాది నవంబరు 19న మూసేశారు. చార్ధామ్లోని కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కూడా త్వరలో తెరుచుకోనున్నాయి.
గుజరాత్లో కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. నెల తర్వాత దొరికిన నిందితుడు
కారుతో బైకును ఢీకొట్టి 12 కి.మీ. ఈడ్చుకెళ్లి ఒకరి మృతికి కారణమైన నిందితుడు నెల రోజుల తర్వాత గుజరాత్ పోలీసులకు దొరికాడు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబరు 18న సూరత్ సమీపంలో బీరేన్ అహిర్ అనే వ్యాపారి బైకుపై వెళ్తున్న పాటిల్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు. దీంతో పాటిల్ అతడి కారు కింద పడిపోయాడు. అక్కడి నుంచి పారిపోయే ఉద్దేశంతో బీరేన్ కారును వేగంగా పోనిచ్చాడు. వాహనం కింద ఇరుక్కుపోయిన పాటిల్ శరీరం సుమారు 12 కి.మీ.వెళ్లిన తర్వాత కిందపడింది. తీవ్రగాయాలతో అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు ఇన్నాళ్లూ ముంబయి, రాజస్థాన్లో దాక్కున్నాడని, గురువారం సూరత్ వైపు వస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒకరి బదులు మరొకరు పరీక్షకు.. ఇద్దరిపై కేసు నమోదు
లఖ్నవూ: కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటీఈటీ)లో ఓ అభ్యర్థి స్థానంలో హాజరైన మరో వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. దీంతో ఆ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన శుభం యాదవ్ అనే వ్యక్తి తన బదులు పరీక్ష రాయాలంటూ అదే రాష్ట్రానికి చెందిన మనీశ్ కుమార్ను సంప్రదించాడు. అందుకు రూ.15వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం ఇద్దరూ కలసి నకిలీ గుర్తింపు పత్రాలు, హాల్ టికెట్లు తయారు చేశారు. పరీక్ష రాయడానికి మనీశ్ లఖ్నవూకు వచ్చాడు. అయితే పరీక్షా కేంద్రంలో పర్యవేక్షణ సిబ్బందికి అతడిపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారి బండారం బయటపడింది.
కుప్పకూలిన 6 ఇళ్లు.. చిన్నారి మృతి
ఆగ్రా: ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో దుర్ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఆరు ఇళ్లు, ఓ దేవాలయం కుప్పకూలడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తి, అతడి ఇద్దరు కుమార్తెలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వారిలో నాలుగేళ్ల చిన్నారి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. సమీంలోని ఓ అతిథి భవనంలో తవ్వకాలు జరుగుతున్నాయని, వాటి ప్రభావంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఇందులో పలువురికి గాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం