అట్టహాసంగా గణతంత్ర వేడుకలు
దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత సైనిక శక్తి, ‘ఆత్మనిర్భరత’ స్ఫూర్తిగా రూపొందించిన స్వదేశీ తయారీ ఆయుధాలు, ఘనమైన దేశ సాంస్కృతిక వారసత్వం కర్తవ్యపథ్లో ప్రతిబింబించాయి.
త్రివర్ణ పతాకానికి వందనం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత సైనిక శక్తి, ‘ఆత్మనిర్భరత’ స్ఫూర్తిగా రూపొందించిన స్వదేశీ తయారీ ఆయుధాలు, ఘనమైన దేశ సాంస్కృతిక వారసత్వం కర్తవ్యపథ్లో ప్రతిబింబించాయి. గురువారం జరిగిన 74వ రిపబ్లిక్డే వేడుకలు ‘నారీశక్తి’ ఇతివృత్తంగా సాగాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. అనంతరం త్రివిధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. వేడులకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్-సీసీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖఢ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కర్తవ్యపథ్లో తొలిసారి.. రాష్ట్రపతి
సాయుధ దళాల గౌరవ వందనం తర్వాత త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరిగింది. నాలుగు ఎంఐ 17 వీ5 హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూలు వెదజల్లాయి. ఈసారి సంప్రదాయ గన్ సెల్యూట్కు ఉపయోగించే పురాతన బ్రిటిష్ పౌండర్ గన్స్ స్థానంలో భారత్లో తయారైన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్లను ఉపయోగించారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కర్తవ్యపథ్లో ద్రౌపదీ ముర్ము త్రివర్ణ పతకానికి వందనం సమర్పించారు.
ప్రత్యేక ఆకర్షణగా ట్యాంకులు, క్షిపణులు
విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు సాగిన పరేడ్లో త్రివిధ దళాలు తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పాయి. ‘ఆత్మనిర్భర్ భారత్’ను ప్రతిబింబించేలా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను ఇందులో ప్రదర్శించారు. ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్, నాగ్ క్షిపణి వ్యవస్థ, కే-9 వజ్రా టీ గన్ సిస్టమ్, బ్రహ్మోస్ క్షిపణులు, బీఎంపీ-2 సాయుధ శకటం, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ హెవీ వెహికల్ పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రఫేల్, మిగ్-29, సుఖోయ్ 30, సుఖోయ్ 30 ఎమ్కేఐ జాగ్వార్, సి-130, సి-17, డోర్నియర్, డకోటా, ఎల్సీహెచ్ ప్రచండ్, అపాచీ వంటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో గర్జించాయి. రిపబ్లిక్ డే ఫ్లై ఫాస్ట్లో మొత్తం 50 విమానాలు విన్యాసాలు చేశాయి. అయితే పొగమంచు కారణంగా అవి ఆహూతులను అలరించలేకపోయాయి.
సామాజిక, ఆర్థిక పురోగతికి అద్దం పట్టేలా శకటాలు
దేశ సాంస్కృతిక భిన్నత్వం, వారసత్వం, ఆర్థిక, సామాజిక పురోగతికి అద్దంపట్టేలా సాగిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 23 శకటాలు ఇందులో పాల్గొన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, త్రిపుర శకటాలు నారీశక్తి, మహిళా సాధికారతను ప్రతిబింబించాయి.
ప్రదర్శన విశేషాలు
* గతేడాది వరకూ పరేడ్ నిర్వహించే మార్గాన్ని రాజ్పథ్గా పిలిచేవారు.. కేంద్ర సర్కారు చేపట్టిన సెంట్రల్ విస్టా పునర్నిర్మాణంలో భాగంగా కొన్ని మార్పులు చేసిన ఈ మార్గం పేరును కర్తవ్య పథ్గా మార్చారు. ఆ తరువాత రిపబ్లిక్ డే ప్రదర్శనను నిర్వహించడం ఇదే తొలిసారి.
* కర్తవ్యపథ్ పరేడ్లో నౌకాదళం, వైమానిక దళం శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 861 బ్రహ్మోస్ రెజిమెంట్ డిటాచ్మెంట్ ఈ కవాతులో పాల్గొంది. ఒంటెలతో కూడిన బీఎస్ఎఫ్ బృందం ఆకట్టుకుంది.
* నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శకటాన్ని ప్రదర్శించడం విశేషం.
* కొత్తగా సైన్యంలో చేరిన అగ్నివీరులు(ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు) పరేడ్లో భాగమయ్యారు.
నారీశక్తి నేతృత్వంలో..
* సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన మహిళా బృందం ఈసారి వేడుకలకు ప్రధాన ఆకర్షణ. దీనికి అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా నేతృత్వం వహించారు.
* 29 ఏళ్ల దిశా అమృత్ 144 మంది యువ సైలర్లున్న నౌకాదళ కవాతు బృందానికి, లెఫ్టినెంట్ చేతనాశర్మ ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థకు, వాయుసేన కవాతు బృందానికి స్క్వాడ్రన్ లీడర్ సింధూ రెడ్డి నాయకత్వం వహించారు.
* దిల్లీ మహిళా పోలీసు బ్యాండ్ తొలిసారిగా గణతంత్య్ర దిన పరేడ్లో పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్