ఎల్ల ఫౌండేషన్- విస్కాన్సన్ ఆధ్వర్యంలో.. వన్ హెల్త్ సెంటర్
వ్యవసాయం, పశుసంపద, మానవ ఆరోగ్య రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ముందే పసిగట్టి..పరిష్కారాలపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు వీలుగా బెంగళూరులో ‘వన్ హెల్త్ సెంటర్’ ఏర్పాటుచేయాలని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్-మాడిసన్ ఆధ్వర్యంలోని గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్, ఎల్ల ఫౌండేషన్ నిర్ణయించాయి.
వ్యవసాయం, పశు, మానవ ఆరోగ్యంపై పరిశోధనలకు అంగీకారం
దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎంఓయూ
ఈనాడు, దిల్లీ: వ్యవసాయం, పశుసంపద, మానవ ఆరోగ్య రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ముందే పసిగట్టి..పరిష్కారాలపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు వీలుగా బెంగళూరులో ‘వన్ హెల్త్ సెంటర్’ ఏర్పాటుచేయాలని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్-మాడిసన్ ఆధ్వర్యంలోని గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్, ఎల్ల ఫౌండేషన్ నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జె.ఒసోరియో, ఎల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులైన భారత్ బయోటెక్ అధిపతులు కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల ఆదివారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో సంతకాలు చేశారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్, వ్యవసాయ పరిశోధన, విద్యాశాఖ కార్యదర్శి హిమాంశుపాఠక్, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రాజేష్ సుధీర్ గోఖలేల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఏడాది చివరిలో ప్రారంభంకానున్న ‘వన్ హెల్త్ సెంటర్’ భారత్లో కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం అందిస్తుంది. భారతీయ విద్యార్థులు, పరిశోధకులు విస్కాన్సన్ యూనివర్సిటీలోని నైపుణ్యం, పరిశోధన, శిక్షణ సౌకర్యాలు ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఈ సందర్భంగా కృష్ణ ఎల్ల మాట్లాడుతూ ‘విస్కాన్సన్ యూనివర్సిటీలో చదవడం, అక్కడి ప్రొఫెసర్లతో మంచి పరిచయం ఉండటం, వారి బలాబలాలు ఏంటన్నది బాగా తెలుసు కాబట్టి ఈ ఒప్పందం కుదర్చుకున్నాం. భారత్లో మొత్తం వైరాలజిస్టుల సంఖ్య 100మందిలోపే ఉంటే ఆ వర్సిటీ క్యాంపస్లోనే వెయ్యిమంది వైరాలజిస్టులు ఉన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అన్నిరకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కనుగొనే ఉద్దేశంతో వన్ హెల్త్ సెంటర్ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను ఎలా నియంత్రించాలన్న అంశంపై ఈ ఫౌండేషన్ ద్వారా పరిశోధనలు చేస్తాం. మా ఫౌండేషన్కు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్ సాంకేతికపరమైన సాయం అందిస్తుంది. సమస్య వచ్చినప్పుడు వ్యాక్సిన్లకు అవసరమైన సాంకేతికత కోసం విదేశాల వద్దకు వెళ్లకుండా ముందే సమస్యను పసిగట్టి దాన్ని నిలువరించే సాంకేతికతను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తాం. ఈ ఫౌండేషన్కు మేం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం కోరడం లేదు. మానవజాతి మేలు కోసం చేసే ఈ కార్యక్రమానికి మేమే నిధులు సమకూరుస్తున్నాం. కొవిడ్ నివారణ కోసం ఇటీవల అభివృద్ధి చేసిన నాసికావ్యాక్సిన్ను ఆసుపత్రులకు సరఫరా చేశాం. మధుమేహం, హృద్రోగం, స్థూలకాయంతో ఉన్నవారికి ఈ నాసికా వ్యాక్సిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గన్యా, జికా, ఫ్లూ వ్యాక్సిన్లపైనా పనిచేస్తున్నాం. ఆఫ్రికాలో కోళ్ల నుంచి మనుషులకు సంక్రమించే నాన్టైఫాయిడ్ సాల్వలైజ్కు వ్యాక్సిన్ కనుక్కోవడంపైనా కసరత్తు చేస్తున్నాం. వన్ హెల్త్ సెంటర్ ద్వారా కేవలం వ్యాక్సిన్లపై మాత్రమే దృష్టిసారించకుండా వ్యవసాయం, మానవ, పశుసంపద రంగాల్లో ఏయే సమస్యలున్నాయన్నది పరిశీలిస్తాం. ఉదాహరణకు ప్రధానమంత్రి ప్రోత్సహిస్తున్న చిరుధాన్యాలకు విలువను జోడించి వాటిని మరింత మంది స్వీకరించేలా ఏం చేయాలన్నదానిపైనా విస్కాన్సన్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తాం’ అని వివరించారు. సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ తమ ఫౌండేషన్ లాభాపాక్షలేకుండా విభిన్న అంశాలపై పరిశోధనలు చేస్తోందని, ప్రపంచస్థాయి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం మొదలుపెట్టామని పేర్కొన్నారు. గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఒసోరియో మాట్లాడుతూ భారత్లో ఆరోగ్య సమస్యలకు ప్రభావశీలమైన పరిష్కారం చూపేందుకే తాము ఎల్ల ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్