ఎల్ల ఫౌండేషన్- విస్కాన్సన్ ఆధ్వర్యంలో.. వన్ హెల్త్ సెంటర్
వ్యవసాయం, పశుసంపద, మానవ ఆరోగ్య రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ముందే పసిగట్టి..పరిష్కారాలపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు వీలుగా బెంగళూరులో ‘వన్ హెల్త్ సెంటర్’ ఏర్పాటుచేయాలని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్-మాడిసన్ ఆధ్వర్యంలోని గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్, ఎల్ల ఫౌండేషన్ నిర్ణయించాయి.
వ్యవసాయం, పశు, మానవ ఆరోగ్యంపై పరిశోధనలకు అంగీకారం
దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎంఓయూ
ఈనాడు, దిల్లీ: వ్యవసాయం, పశుసంపద, మానవ ఆరోగ్య రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ముందే పసిగట్టి..పరిష్కారాలపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు వీలుగా బెంగళూరులో ‘వన్ హెల్త్ సెంటర్’ ఏర్పాటుచేయాలని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్-మాడిసన్ ఆధ్వర్యంలోని గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్, ఎల్ల ఫౌండేషన్ నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జె.ఒసోరియో, ఎల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులైన భారత్ బయోటెక్ అధిపతులు కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల ఆదివారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో సంతకాలు చేశారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్, వ్యవసాయ పరిశోధన, విద్యాశాఖ కార్యదర్శి హిమాంశుపాఠక్, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రాజేష్ సుధీర్ గోఖలేల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఏడాది చివరిలో ప్రారంభంకానున్న ‘వన్ హెల్త్ సెంటర్’ భారత్లో కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం అందిస్తుంది. భారతీయ విద్యార్థులు, పరిశోధకులు విస్కాన్సన్ యూనివర్సిటీలోని నైపుణ్యం, పరిశోధన, శిక్షణ సౌకర్యాలు ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఈ సందర్భంగా కృష్ణ ఎల్ల మాట్లాడుతూ ‘విస్కాన్సన్ యూనివర్సిటీలో చదవడం, అక్కడి ప్రొఫెసర్లతో మంచి పరిచయం ఉండటం, వారి బలాబలాలు ఏంటన్నది బాగా తెలుసు కాబట్టి ఈ ఒప్పందం కుదర్చుకున్నాం. భారత్లో మొత్తం వైరాలజిస్టుల సంఖ్య 100మందిలోపే ఉంటే ఆ వర్సిటీ క్యాంపస్లోనే వెయ్యిమంది వైరాలజిస్టులు ఉన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అన్నిరకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కనుగొనే ఉద్దేశంతో వన్ హెల్త్ సెంటర్ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను ఎలా నియంత్రించాలన్న అంశంపై ఈ ఫౌండేషన్ ద్వారా పరిశోధనలు చేస్తాం. మా ఫౌండేషన్కు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్ సాంకేతికపరమైన సాయం అందిస్తుంది. సమస్య వచ్చినప్పుడు వ్యాక్సిన్లకు అవసరమైన సాంకేతికత కోసం విదేశాల వద్దకు వెళ్లకుండా ముందే సమస్యను పసిగట్టి దాన్ని నిలువరించే సాంకేతికతను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తాం. ఈ ఫౌండేషన్కు మేం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం కోరడం లేదు. మానవజాతి మేలు కోసం చేసే ఈ కార్యక్రమానికి మేమే నిధులు సమకూరుస్తున్నాం. కొవిడ్ నివారణ కోసం ఇటీవల అభివృద్ధి చేసిన నాసికావ్యాక్సిన్ను ఆసుపత్రులకు సరఫరా చేశాం. మధుమేహం, హృద్రోగం, స్థూలకాయంతో ఉన్నవారికి ఈ నాసికా వ్యాక్సిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గన్యా, జికా, ఫ్లూ వ్యాక్సిన్లపైనా పనిచేస్తున్నాం. ఆఫ్రికాలో కోళ్ల నుంచి మనుషులకు సంక్రమించే నాన్టైఫాయిడ్ సాల్వలైజ్కు వ్యాక్సిన్ కనుక్కోవడంపైనా కసరత్తు చేస్తున్నాం. వన్ హెల్త్ సెంటర్ ద్వారా కేవలం వ్యాక్సిన్లపై మాత్రమే దృష్టిసారించకుండా వ్యవసాయం, మానవ, పశుసంపద రంగాల్లో ఏయే సమస్యలున్నాయన్నది పరిశీలిస్తాం. ఉదాహరణకు ప్రధానమంత్రి ప్రోత్సహిస్తున్న చిరుధాన్యాలకు విలువను జోడించి వాటిని మరింత మంది స్వీకరించేలా ఏం చేయాలన్నదానిపైనా విస్కాన్సన్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తాం’ అని వివరించారు. సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ తమ ఫౌండేషన్ లాభాపాక్షలేకుండా విభిన్న అంశాలపై పరిశోధనలు చేస్తోందని, ప్రపంచస్థాయి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం మొదలుపెట్టామని పేర్కొన్నారు. గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఒసోరియో మాట్లాడుతూ భారత్లో ఆరోగ్య సమస్యలకు ప్రభావశీలమైన పరిష్కారం చూపేందుకే తాము ఎల్ల ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ