Uttar Pradesh: వర్షంలో బైక్‌పై వెళ్తూ.. సబ్బుతో స్నానం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఇద్దరు యువకులు విచిత్రంగా ప్రవర్తించారు. వర్షం కురుస్తున్న సమయంలో ఒంటికి సబ్బు రాసుకుని.. బైక్‌పై అర్ధనగ్నంగా ప్రయాణిస్తూ స్నానం చేశారు.

Updated : 02 Jul 2023 07:45 IST

త్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఇద్దరు యువకులు విచిత్రంగా ప్రవర్తించారు. వర్షం కురుస్తున్న సమయంలో ఒంటికి సబ్బు రాసుకుని.. బైక్‌పై అర్ధనగ్నంగా ప్రయాణిస్తూ స్నానం చేశారు. ఈ ఘటనను అటుగా వెళ్తున్న వాహనదారులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియోపై కాన్పుర్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పందించారు. బహిరంగ ప్రాంతంలో వాహనదారులను ఇబ్బందులకు గురి చేసిన ఆ ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు ట్రాఫిక్‌ డీసీపీ రవీనా త్యాగి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని