వీసాలతో సిక్కు యువతకు ఎర
ఖలిస్థాన్కు అనుకూలంగా కెనడా నుంచి కార్యకలాపాలు నడిపేందుకు అమాయక సిక్కు యువతను వీసాలతో ప్రలోభపెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి.
చిరుద్యోగాల ముసుగులో తీసుకువచ్చి ఉద్యమ విస్తరణ
కెనడాలో ఖలిస్థాన్ అనుకూలుర తీరు
గురుద్వారాలపై నియంత్రణ.. వాటిలోనే ఆశ్రయం
దిల్లీ: ఖలిస్థాన్కు అనుకూలంగా కెనడా నుంచి కార్యకలాపాలు నడిపేందుకు అమాయక సిక్కు యువతను వీసాలతో ప్రలోభపెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వీసాలను స్పాన్సర్ చేయడం ద్వారా వారిని కెనడాకు రప్పిస్తున్నా దాని వెనుక ఏకైక లక్ష్యం మాత్రం ఖలిస్థాన్ ఎజండాను అమలు చేయడమేనని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఇటీవల హత్యకు గురైన ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మాత్రమే కాకుండా మణీందర్ సింగ్ బుయాల్, పర్మీందర్ పంగ్లీ, భగత్సింగ్ బ్రార్ వంటి ఇతర నేతలు కూడా ఇదేపని చేసేవారని తెలిపాయి. ప్లంబర్లు, ట్రక్కు డ్రైవర్లు, గురుద్వారాల్లో మతపరమైన పనిచేసే సేవాదార్ వంటి ఉద్యోగాల పేరుతో యువతను రప్పించి, వారి వీసాలను స్పాన్సర్ చేయించే కొత్త ఆలోచనకు ఖలిస్థాన్ ఉద్యమనేతలు తెరతీశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం, మతపరమైన విప్లవవాద సమావేశాల నిర్వహణ వంటి పనులకు వీరిని వాడుకునేవారు. చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ, ఆశ్రయం కోసం ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, ఇతర భారతీయ యువతకు చేయూత ఇస్తున్నట్లుగా కనిపిస్తూ, చివరకు ఉద్యమ విస్తరణ కార్యకలాపాలకు వాడుకునేవారు. దీనికోసం గురుద్వారా వనరుల్నీ వినియోగించుకునేవారు. పొందిన సాయానికి బదులుగా ఇష్టంగానో, అయిష్టంగానో వారు ఖలిస్థాన్ బలగాలతో కలిసి పనిచేసే పరిస్థితి వచ్చేది. పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ గ్రూపు నేతలు తమ ఉద్యమం విజయవంతం అవుతోందని భ్రమ కల్పించేందుకు ఇలాంటివారిని వాడుకునేవారు. సర్రే, బ్రాంప్టన్, ఎడ్మంటన్ వంటి చోట్ల ఉన్న దాదాపు 30 గురుద్వారాలపై వారికి నియంత్రణ ఉండడంతో ఎక్కువమందిని రప్పించే పని సులువయ్యేది.
ఒక లేఖ విలువ రూ.2 లక్షలు
పంజాబ్లోని గ్యాంగ్స్టర్లతో నిజ్జర్, బుయాల్, బ్రార్ వంటివారు పొత్తుపెట్టుకుని వారిని కెనడాకు రప్పించి, బదులుగా తమవారిచేత పంజాబ్లో ఉగ్రదాడులు చేయించేవారని బయటపడింది. భారత్లో మత ప్రాతిపదికన అణచివేతను ఎదుర్కొంటున్నారని చిత్రించి, కెనడాలో రాజకీయ శరణార్థులుగా ఉండేలా లేఖలు ఇచ్చేందుకు లక్ష నుంచి రూ.2 లక్షల వరకు కొందరు ఖలిస్థాన్ అనుకూల రాజకీయ పార్టీల నేతలు వసూలు చేయడం గమనార్హం. ఇలాంటి లేఖలతో కెనడాకు వెళ్లాక ఖలిస్థాన్ ఉద్యమంలో అనివార్యంగా చేరేవారు.
పన్నూపై నిషేధం విధించండి
‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ పన్నూ కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు హెచ్ఎఫ్సీ ప్రతినిధి కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రిని కలిసి వినతి సమర్పించారు. పన్నూపై ఇప్పటికే భారత్ కన్నెర్ర చేసింది. నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ఎంపీ జగ్మీత్సింగ్ అమెరికాలోని ఒట్టావాలో ఆరోపించారు.
పాక్ ఐఎస్ఐ హస్తం ఉందా?
నిజ్జర్ హత్య వెనుక పాక్ ఐఎస్ఐ హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ను దోషిగా చేయాలని ఐఎస్ఐ ఈ కుట్ర పన్ని ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నిజ్జర్కు కెనడాలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలున్నాయి. కెనడాకు వచ్చే తమ గ్యాంగ్స్టర్లకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఐఎస్ఐ గత కొన్నేళ్లుగా నిజ్జర్పై ఒత్తిడి పెంచుతోంది. అతను మాత్రం ఖలిస్థానీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. కోపం పెంచుకున్న ఐఎస్ఐ.. నిజ్జర్ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం