Chandrayaan-3: ఆ కొలిమి తోడుంటే.. విక్రమ్ నిద్ర లేచేదే!
ఎవరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరిన భారత విక్రమ్ ల్యాండర్.. అందులో నుంచి బయటకువెళ్లి చక్కర్లు కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్లు చంద్రుడిపై 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ నిద్రలేవాలని యావత్ ప్రపంచం కోరుకుంది.
చందమామపై చిమ్మచీకట్లను చీల్చుకుంటూ తెల్లవారింది. కానీ విక్రముడు మాత్రం లేవలేదు!
అలవాటు లేని చలిలో గడ్డకట్టుకుపోయాడు!
ఎవరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరిన భారత విక్రమ్ ల్యాండర్(Vikram lander).. అందులో నుంచి బయటకువెళ్లి చక్కర్లు కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్లు చంద్రుడిపై 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ నిద్రలేవాలని యావత్ ప్రపంచం కోరుకుంది. సెప్టెంబరు 22న అక్కడ తెల్లవారింది. కానీ ఆ వ్యోమనౌకల నుంచీ ఇప్పటికీ స్పందన లేదు. దీంతో అవి మేల్కొని, మళ్లీ పరిశోధనలు చేస్తాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. వెళ్లేటప్పుడు వెంట కొలిమిలాంటి ఓ సాధనాన్ని తీసుకెళ్లుంటే విక్రమ్ ఇప్పటికల్లా మళ్లీ క్రియాశీలమై ఉండేది.
విక్రమ్ ఎందుకు లేవలేదు?
విక్రమ్, ప్రజ్ఞాన్లకు(Pragyan rover) సౌరశక్తే ఆధారం. అందువల్ల అవి చంద్రుడి ఉపరితలంపై 14 రోజుల పగటి సమయంలోనే పనిచేయగలవు. ఆ తర్వాత వచ్చిన 14 రోజుల రాత్రి వేళలో మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. అంత శీతల వాతావరణంలో రెండు వారాలు కొనసాగడం వల్ల వ్యోమనౌకల్లోని కొన్ని లోహభాగాలు పెళుసుబారుతాయి. ఫలితంగా అవి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ తిరిగి సూర్యోదయమై, వేడి వాతావరణం నెలకొన్నా.. అవి పనిచేయలేని పరిస్థితి నెలకొంటుంది.
ఏమిటీ కొలిమి?
వ్యోమనౌకల్లో పరమాణు జనరేటర్లను ఏర్పాటు చేస్తే శీతల వాతావరణంలోనూ పరికరాలను వెచ్చగా ఉంచొచ్చు. వీటిని రేడియోఐసోటోపిక్ హీటర్ యూనిట్ (ఆర్హెచ్యూ)గా పేర్కొంటారు. ఇందులో ఎక్కువగా ప్లుటోనియం-238ను ఇంధనంగా వాడుతుంటారు. ఈ పదార్థం.. సహజసిద్ధ రేడియోధార్మిక క్షీణతకు గురవుతుంటుంది. దీన్ని ‘ఆల్ఫా డికే’ అంటారు. ఇలా క్షీణించే క్రమంలో భారీగా ఉష్ణశక్తి వెలువడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం పరమాణు జనరేటర్లలో కీలక సూత్రం.
- ఆర్హెచ్యూలు ఉత్పత్తి చేసే ఉష్ణాన్ని విద్యుత్తుగా మార్చే సాధనాన్ని రేడియోఐసోటోపిక్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్లు (ఆర్టీజీ)గా పేర్కొంటారు. అందులోని థర్మోకపుల్ (సీ బ్యాక్ ఎఫెక్ట్) సాయంతో అది కరెంటుగా మారుతుంది. దాన్ని బ్యాటరీల్లో నిల్వ చేయవచ్చు.
- ఈ హీటర్లు అందించే వేడితో వ్యోమనౌకల్లోని సున్నితమైన భాగాలను వెచ్చటి వాతావరణంలో ఉంచొచ్చు.
- రేడియోధార్మిక క్షీణత ప్రక్రియ దశాబ్దాలపాటు సాగుతుంది. అందువల్ల ఆర్టీజీ అన్నేళ్ల పాటు నిరాటంకంగా విద్యుత్తును అందించగలదు.
- కిలో ప్లుటోనియంతో 80 లక్షల కిలోవాట్ అవర్ల మేర కరెంటును ఉత్పత్తి చేయవచ్చు.
- ఆర్టీజీల్లో కదిలే భాగాలు ఉండవు. అందువల్ల వాటికి సర్వీసింగ్ అవసరం ఉండదు.
విరివిగా..
అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా.. 1977లో ప్రయోగించిన వాయేజర్-1, 2 వ్యోమనౌకలు సౌర కుటుంబాన్ని దాటి వెళ్లాయి. అక్కడ సూర్యకాంతి స్వల్పంగా కూడా అందుబాటులో ఉండదు. అయినా ఆ వ్యోమనౌకలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. కారణం వాటిలోని ఆర్టీజీలే. పయనీర్, వైకింగ్, కసీని, న్యూ హొరైజన్స్, క్యూరియాసిటీ, పర్సెవరెన్స్ వంటి వ్యోమనౌకల్లోనూ నాసా ఈ సాధనాలను ఏర్పాటు చేసింది.
- 1970 నవంబరు 17న చంద్రుడిపై మొదటి రోవర్ను దించిన దేశంగా సోవియట్ యూనియన్ ఘనత సాధించింది. లూనోఖోడ్-1 అనే ఆ వ్యోమనౌక.. జాబిల్లి ఉపరితలంపై 10 నెలల్లో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సౌరఫలకాల సాయంతోనే దానికి శక్తి అందింది. రాత్రివేళల్లో మాత్రం పొలోనియం-210 రేడియోఐసోటోప్ హీటర్ దాన్ని వెచ్చగా ఉంచేది.
- 2013లో జాబిల్లిపైకి చైనా పంపిన చాంగే-3 ల్యాండర్, యుతు రోవర్లలోనూ ఇలాంటి హీటింగ్ సాధనాలే ఉన్నాయి. యుతు.. జాబిల్లిపై తొలి రాత్రి మనుగడ సాగించింది. రెండో రాత్రి తర్వాత మొరాయించింది.
- 2018లో చందమామ ఆవలి భాగంలో తొలిసారిగా చైనా దించిన చాంగే-4 ల్యాండర్, యుతు-2 రోవర్ మాత్రం ఆర్టీజీల సాయంతో నాలుగున్నరేళ్లుగా పనిచేస్తున్నాయి.
- చంద్రయాన్-3 ల్యాండింగ్కు ముందు జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగే క్రమంలో కూలిపోయిన లూనా-25(రష్యా)లోనూ ఆర్టీజీ సాధనం ఉంది.
ఇస్రో కసరత్తు
చంద్రయాన్-3 ద్వారా.. చందమామపై ల్యాండింగ్ను సాఫీగా సాగించడంపైనే భారత్ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించింది. అందుకే ఈ దశలో ఆర్టీజీల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ, దాని ఆవశ్యకతను గుర్తించింది. వాటి సాకారం దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం భాభా అణు పరిశోధన కేంద్రం (బార్క్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయోగాత్మకంగా 5 వాట్ల ఆర్టీజీని తయారుచేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకొంది. అది సాకారమైతే మెటలర్జీ, మెటీరియల్ సైన్స్ రంగంలో భారత ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. ఇస్రో ప్రణాళికలు రచిస్తున్న మంగళయాన్-2, శుక్రయాన్ వంటి వ్యోమనౌకలకు ఇది ఉపయోగపడుతుంది.
పాపం ఆర్టీజీ లేక..!
2014లో 67పి/చుర్యుమోవ్ గెరాసిమెంకో అనే తోకచుక్కపైకి ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ).. సౌరశక్తితో నడిచే ఫీలే ల్యాండర్ను దించింది. అయితే అది పొరపాటున శాశ్వత చీకటి ప్రదేశంలో దిగింది. దీంతో.. ఎంతో వ్యయప్రయాసలకోర్చి రూపొందించిన ఈ వ్యోమనౌక కొన్నిగంటలే పనిచేసింది. ఫీలేలో ఆర్టీజీని ఏర్పాటు చేసి ఉంటే.. చీకటి ప్రదేశంలో దిగినా అది పనిచేసి ఉండేది.
రాకెట్లకూ ఇంధనంగా..
ఆర్టీజీ స్ఫూర్తితో అణుశక్తితో నడిచే రాకెట్లనూ అభివృద్ధి చేయడానికి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిజ్ఞానం పేరు న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్. ఇందులో అణు విచ్ఛిత్తి ప్రక్రియ ద్వారా యురేనియం పరమాణువులను విడగొడతారు. ఫలితంగా వెలువడే వేడి.. ద్రవ హైడ్రోజన్ను వాయు రూపంలోకి మారుస్తుంది. ఆ వాయువు.. రాకెట్ నాజిల్ గుండా వేగంగా దూసుకెళ్లి థ్రస్టును ఉత్పత్తి చేస్తుంది.
సవాళ్లు..
- చిన్నపాటి వ్యోమనౌకలో ఇమిడిపోయేలా ఆర్టీజీల బరువు, పరిమాణం తక్కువగా ఉండాలి.
- 1964 ఏప్రిల్ 21న అమెరికా ప్రయోగించిన ట్రాన్సిట్-5బీఎన్-3 అనే నేవిగేషన్ ఉపగ్రహం.. ప్రయోగ సమయంలో విఫలమైంది. అది మడగాస్కర్కు ఉత్తరాన మండిపోయింది. ఈ క్రమంలో అందులోని ప్లుటోనియం ఇంధనం వాతావరణంలో పడిపోయింది. కొద్ది నెలల తర్వాత కూడా ఆ ప్రాంతంలో స్వల్ప పరిమాణంలో ప్లుటోనియం-238 జాడలు కనిపించాయి. అందువల్ల ఆర్టీజీల్లో ఇంధనాన్ని సురక్షితంగా భద్రపరచాలి. ప్రమాదం సంభవించినా అది లీక్ కాకుండా చూసుకోవాలి.
- ఆర్టీజీల్లో ఎంపిక చేసుకున్న రేడియోధార్మిక పదార్థాలు బీటా, గామా, న్యూట్రాన్ రేడియోధార్మికతను మరీ ఎక్కువగా విడుదల చేయకూడదు. వాటివల్ల వ్యోమనౌకలోని ఇతర పరికరాల పనితీరు ప్రభావితమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం