Uttarakhand Tunnel: మృత్యుంజయులు
అందరి ప్రార్థనలు ఫలించాయి. దృఢ సంకల్పంతో దీక్షగా చేపట్టిన సహాయక చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. నేడు, రేపు అంటూ 17 రోజులుగా సొరంగంలోనే గడిపిన 41 మంది ఎట్టకేలకు సురక్షితంగా బయటకు రాగలిగారు.
17 రోజుల తర్వాత సొరంగం నుంచి సురక్షితంగా బయటకొచ్చిన 41 మంది కూలీలు
చివరి క్షణంలో అడ్డంకుల్ని తొలగించిన ర్యాట్ హోల్ మైనర్లు
ఉత్తరాఖండ్ సొరంగం కథ సుఖాంతం.. సర్వత్రా హర్షం
ఉత్తర్కాశీ: అందరి ప్రార్థనలు ఫలించాయి. దృఢ సంకల్పంతో దీక్షగా చేపట్టిన సహాయక చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. నేడు, రేపు అంటూ 17 రోజులుగా సొరంగంలోనే(Uttarakhand Tunnel) గడిపిన 41 మంది ఎట్టకేలకు సురక్షితంగా బయటకు రాగలిగారు. ఒక దశలో భారీ యంత్రాలు మొరాయించాయి, సాంకేతిక నిపుణుల వ్యూహాలు ఫలించలేదు. చివరికి రంగంలోకి దిగిన నిపుణులైన కూలీలు తమ చేతులతో, చిన్నపాటి పనిముట్లతో ఆ పనిని పూర్తిచేశారు. నానా తిప్పలు పెట్టిన చిట్టచివరి భాగాన్ని వారు నేర్పుగా తొలుచుకుంటూ వెళ్లడం, ఆ మేరకు వెడల్పైన పైపుగొట్టాలను ప్రవేశపెట్టి నిష్క్రమణ మార్గాన్ని సిద్ధం చేయడంతో మంగళవారం రాత్రి ఒక్కొక్కరుగా కూలీలంతా బయటి ప్రపంచంలోకి వచ్చారు. అలుపెరగకుండా తమ కోసం పనిచేసిన యంత్రాంగాన్ని, అధికారుల్ని, క్షేమ సమాచారం కోసం కళ్లుకాయలు కాసేలా నిరీక్షిస్తున్న కుటుంబసభ్యుల్ని చూసి వారు ఉద్వేగానికి లోనయ్యారు. ఘటనాస్థలంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామీ, కేంద్ర మంత్రి వి.కె.సింగ్, ఇతర ఉన్నతాధికారులు తమకు పూలమాలలు వేసి, భుజం తట్టి క్షేమ సమాచారాన్ని ఆరా తీసినప్పుడు కొందరు కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. వారికి పాదాభివందనం చేసి చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞత చాటుకున్నారు. సహాయకచర్యలు విజయవంతం కావడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు హర్షం వ్యక్తంచేశారు.
నిజంగా భగీరథ యత్నం
ఉత్తరాఖండ్లో చార్ధామ్ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిల్క్యారా వద్ద సొరంగం తవ్వే పనిలో నిమగ్నమైన కార్మికుల్లో 41 మంది ఈ నెల 12న అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. యావద్దేశాన్ని కదిలించిన ఈ ఘటనలో ఆ కార్మికులను ఆదుకునేందుకు భారీ యంత్రాలతో, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అవిశ్రాంతంగా పనిచేశాయి. సొరంగానికి ఒకపక్క పని పూర్తికాకపోవడం, రెండోవైపు నుంచి రావాలంటే దాదాపు 60 మీటర్ల పొడవునా శిథిలాలు అడ్డుగా ఉండడంతో ఎలా ముందడుగు వేయాలనేది యంత్రాంగానికి పెనుసవాల్గా మారింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్వో, సైన్యంలోని ఇంజినీరింగ్ విభాగం, జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వంటివి అనేకం రంగంలో దిగి వేర్వేరు ప్రత్యామ్నాయాలను పరిశీలించాయి. భూమికి సమాంతరంగా సొరంగంలో గొట్టపుమార్గం వేయాలని నిర్ణయించి పనులు చేపట్టాక చివర్లో చిక్కుముడి ఎదురైంది. దాదాపు 12 మీటర్ల మేర ఇంకా తవ్వాల్సి ఉండగా 25 టన్నుల డ్రిల్లింగ్ యంత్రం విరిగి ముక్కలై ఆశలపై నీళ్లు జల్లింది. నానా తంటాలు పడి దానిని తొలగించినా పనులకు మళ్లీ అడ్డంకులు ఎదురై సహనాన్ని పరీక్షించాయి.
ఆ చేతులు సుసాధ్యం చేశాయి
సన్నని మార్గం ద్వారా బొగ్గును బయటకు తీసుకువచ్చే నైపుణ్యం ఉన్న కార్మికులు రంగంలో దిగాక పరిస్థితి ఒక్కసారిగా సానుకూలంగా మారింది. చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చే గొట్టపు మార్గం నిర్మాణానికి అడ్డంగా ఉన్నవాటిని వారు విజయవంతంగా తొలగించగలిగారు. వీరు కొన్ని చిన్నచిన్న పనిముట్ల సాయంతో సోమవారం నుంచి తవ్వకం ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రానికి ఒక దశలో మరో రెండుమీటర్ల పని మాత్రమే మిగిలి ఉండడంతో అటు సహాయక బృందాల్లో, ఇటు కూలీల కుటుంబికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ముందస్తు సంబరాలు మొదలయ్యాయి. కాసేపట్లోనే.. అటు నుంచి తవ్వుతున్న శబ్దం తమకు వినిపించడంతో లోపలున్న కూలీలు తమ చెవుల్ని తామే నమ్మలేకపోయారు. లోపలకు వచ్చిన కార్మికులను చూసి వారు సంబరపడి తమ వద్దనున్న ఎండుఫలాలు అందించి ఆనందం పంచుకున్నారు. మరికాసేపట్లోనే గొట్టపు మార్గం సిద్ధం కావడం, దాని నుంచి ఒక్కొక్కరు పాకుతూ బయటకు రావడం సజావుగా సాగిపోయింది. సొరంగం వద్ద ఒకరినొకరు అభినందించుకున్నారు. కూలీలను వెంటనే వైద్య చికిత్సకు తరలించారు. రోజుల తరబడి సొరంగంలోనే ఉన్న కూలీల ఆరోగ్య పరిస్థితిని 2-3 రోజులపాటు క్షుణ్నంగా పరిశీలించి, వారు అన్నివిధాలా బాగున్నారని తేలిన తర్వాతే స్వస్థలాలకు పంపించనున్నారు. ఎవరి పరిస్థితీ ప్రమాదకరంగా లేదని సీఎం ధామీ ధ్రువీకరించారు. అందరిలో అత్యంత చిన్న వయసు వ్యక్తిని మొదటగా బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూలీలతో ఫోన్లో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్నారు.
మాన్యువల్గానే శీఘ్ర పురోగతి
చిన్నచిన్న పరికరాల సాయంతో కార్మికులతో తవ్వించే పనులు (మాన్యువల్ డ్రిల్లింగ్) మొదలయ్యాక శీఘ్ర పురోగతి కనిపించింది. క్రిస్మస్ వరకు వీరు బయటకు రాలేకపోవచ్చని అంతర్జాతీయ నిపుణుడు ఒక దశలో చెప్పడంతో అలముకున్న నైరాశ్యం ఒక్కసారిగా వీడిపోయింది. కూలీలు 24 గంటల్లోపే 10 మీటర్లు తవ్వడం విశేషం. మిగిలిన రెండు మీటర్ల పనిని ఆ తర్వాత మరింత జాగ్రత్తలు తీసుకుని రాత్రి 7 గంటలకు పూర్తిచేశారు. మొదట బయటకు వచ్చిన కూలీని తీసుకుని అంబులెన్సు బయల్దేరే సరికి రాత్రి ఎనిమిదైంది. అంబులెన్సులు వెళ్లేందుకు వీలుగా అప్పటికే మార్గం సిద్ధంచేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని వాయుమార్గంలో తరలించేందుకు చినూక్ హెలికాప్టర్లను అందుబాటులో ఉంచారు. కొండను పైనుంచి డ్రిల్లింగ్ చేసే పనుల్ని నిలిపివేశారు.
క్షేమంగా ఉన్నా చివరి వరకు ఆందోళన
చిక్కుకుపోయిన చోట సొరంగంలో తిరుగాడడానికి రెండు కి.మీ. మేర ప్రాంతం ఉండడం, బయటి నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు వంటివన్నీ అందుకునే వెసులుబాటును కల్పించడంతో కూలీలు క్షేమంగానే ఉన్నా, పూర్తిగా బయటపడేవరకు ఆందోళనతో కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. అందుకే కూలీలు బయటకు వస్తున్నప్పుడు అక్కడంతా ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకుంటూ, ‘హరహర మహాదేవ్’.. ‘భారత్ మాతాకీ జై’ అని నినాదాలు చేశారు. ప్రధాని మోదీ వల్లనే ఈ విజయం సాధ్యమైందని మరికొందరు నినదించారు. సొరంగం బయట ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడి వద్ద స్థానికులు పూజలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల