నేవీకి మరో స్వదేశీ విమానవాహక నౌక!
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి సరికొత్త బలం లభించబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రెండో విమానవాహక నౌకను నిర్మించాలన్న నేవీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించబోతోంది.
దిల్లీ: హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి సరికొత్త బలం లభించబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రెండో విమానవాహక నౌకను నిర్మించాలన్న నేవీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించబోతోంది. దాదాపు రూ.40వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు రక్షణ కొనుగోళ్ల బోర్డు (డీపీబీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనడానికి ఇది నిదర్శనమని వివరించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో గురువారం జరిగే రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో ఈ అంశం పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీనికితోడు రూ.1.15 లక్షల కోట్లతో 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాల కొనుగోలు కోసం భారత వైమానిక దళం తెచ్చిన ప్రతిపాదనపైనా డీఏసీలో చర్చ జరిగే వీలుందని తెలిపాయి.
ప్రతిపాదిత రెండో స్వదేశీ విమానవాహక నౌక (ఐఏసీ-2) బరువు 45వేల టన్నులు ఉండొచ్చు. దీన్ని కొచ్చిన్ షిప్యార్డ్ నిర్మించనుంది. అది కూడా విక్రాంత్ తరహాలోనే ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాల కొనుగోలుకు ఆమోదం లభిస్తే భారత వాయుసేన అమ్ములపొదిలో ఈ జెట్ల సంఖ్య 180కి పెరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?