అటవీ భూముల లీజుకు కొత్త నిబంధనలు
అటవీభూముల లీజుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అటవీ భూములను లీజుకు ఇచ్చేటప్పుడు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది.
ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే
ఈనాడు, దిల్లీ: అటవీభూముల లీజుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అటవీ భూములను లీజుకు ఇచ్చేటప్పుడు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది. వీటి ప్రకారం.. అటవీ భూములను ఉపయోగించుకోవాలనుకున్న సంస్థలు.. లీజుకోసం ‘పరివేష్ పోర్టల్’ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఏ అటవీభూమినీ లీజుకు ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ మైనింగ్ లీజు మీద అటవీభూమిని అప్పగిస్తే సంబంధిత ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల తవ్వకాలు చేపట్టకూడదు.
మైనింగ్యేతర కార్యకలాపాల కోసం లీజుకు ఇచ్చినప్పుడు మాత్రం మొక్కలు నాటడం, తాత్కాలిక నిర్మాణాల కోసం పరిమిత స్థాయిలో తవ్వకాలకు అనుమతిస్తారు. నిబంధనల ప్రకారం అటవీ భూమి మళ్లింపు కింద అనుమతులు తీసుకున్నాకే అక్కడ మైనింగ్ చేపట్టాలి. అలాగే సంబంధిత అథీకృత సంస్థలు ఆమోదించిన మైనింగ్ ప్రణాళికను సమర్పించాలి. అక్కడ గనుల తవ్వకాలు చేపట్టడానికి ముందు, చేపట్టిన తర్వాత ఎంతమేరకు భూమి ఉపయోగించేదీ చెప్పాలి. గని మూసివేత ప్రణాళికనూ సమర్పించాలి. మైనింగ్ కార్యకలాపాలు కాకుండా మిగతా ఏయే కార్యకలాపాలు చేపట్టబోయేదీ వివరిస్తూ డీపీఆర్ ఇవ్వాలి.
- ఈ చట్టంలోని నిబంధనల కింద అటవీభూముల లీజుకు ఆమోదముద్ర వేసినా అనుమతులు పొందిన సంస్థకు ఆ భూమిపై ఎలాంటి హక్కులూ ఉండవు.
- కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా 2015 ఏప్రిల్ 1కి ముందే అటవీ భూముల్లో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టిన సంస్థలు వెంటనే అనుమతులు తీసుకోవాలి. ఆ గని పరిధిలో ఎంత అటవీభూమి ఉంటే దానంతటికీ కొత్తగా అనుమతులు తీసుకొనేంతవరకూ తవ్వకాలు జరపడానికి వీల్లేదు. సదరు మైనింగ్ లీజు పరిధిలోకివచ్చే అటవీభూమి ప్రస్తుత నికర విలువను సదరు సంస్థ నుంచి రాబట్టాలి.
- అటవీ భూములను వినియోగించే సంస్థల నుంచి వసూలుచేసే పరిహారాన్ని ‘స్టేట్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ’ ఖాతాలో జమచేయాలి.
- అటవీ భూముల లీజులు మైనింగ్ లీజుల కాలపరిమితితో పాటే ముగుస్తాయి.
- మైనింగ్యేతర కార్యకలాపాలకోసం అటవీ భూములను లీజుకు ఇచ్చేట్లయితే భూవినియోగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ, మైనింగ్ లీజు ఒప్పందాలపై సంతకాలుచేసి.. ఆ ఒప్పంద పత్రాలను, లీజ్ రెంట్ వివరాలతో సహా సమర్పించాలి.
- ఒకవేళ ఏ అటవీభూమికి సంబంధించిన ప్రతిపాదనలైనా న్యాయ వివాదాల్లో ఉంటే వాటిపై కోర్టులు, ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పుల ఆధారంగా చర్యలు తీసుకోవాలి.
- అటవీయేతర కార్యకలాపాలకోసం లీజుకు ఇచ్చిన అటవీభూముల్లో జరుగుతున్న కార్యకలాపాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా పరిశీలించి, అందుకు సంబంధించిన నివేదికను పరివేష్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. లీజుకు తీసుకున్న సంస్థలు నిబంధనలు పాటించడంలేదని గుర్తిస్తే ఆ వివరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనలకు అనుగుణంగా దిద్దుబాటు చర్యలు చేపట్టేలా చూడాలి.
- రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ భూములను లీజుకు ఇచ్చేటప్పుడు ‘షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషినల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) యాక్ట్- 2006తోపాటు, ఈ అంశంతో ముడిపడిన ఇతర చట్టాల్లోని నిబంధనలన్నీ అనుసరించాలి.
- లీజుకు ఇచ్చే అటవీభూమి చట్టబద్ధమైన హోదాలో ఎప్పటికీ మార్పుచేయకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి