రోజుకు సగటున 78 హత్యలు
దేశంలో 2022లో 28,522 హత్యకేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో నమోదైన మొత్తం హత్య కేసులతో(29,272) పోల్చితే 2022లో 2.6 శాతం తగ్గుదల నమోదైంది.
2022లో దేశవ్యాప్తంగా 28,522 కేసులు
సాధారణ నేరాల్లో తగ్గుదల
మహిళలు, చిన్నారులపై మాత్రం పెరిగాయి
జాతీయ నేర గణాంకాలు-2022లో వెల్లడి
ఈనాడు, దిల్లీ: దేశంలో 2022లో 28,522 హత్యకేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో నమోదైన మొత్తం హత్య కేసులతో(29,272) పోల్చితే 2022లో 2.6 శాతం తగ్గుదల నమోదైంది. వివాదాలే హత్యలకు ప్రధాన కారణాలు. ఆ తర్వాత ప్రధాన కారణాలుగా వ్యక్తిగత ప్రతీకారం, శతృత్వం, వ్యక్తిగత ప్రయోజనం ఉన్నాయి. ఇక సాధారణ నేరాలు 2022లో తగ్గాయి. మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలు, వయోవృద్ధులపై మాత్రం పెరిగాయి. సోమవారం విడుదలైన జాతీయ నేరగణాంకాలు-2022 ఈ విషయాన్ని వెల్లడించాయి. 2021తో పోలిస్తే 2022లో సాధారణ నేరాల సంఖ్య 4.5% మేర తగ్గింది. అదే సమయంలో మహిళలపై 4%, చిన్నారులపై 8.7% పెరిగాయి. కిడ్నాప్లు 5.8%, వృద్ధులపై వేధింపులు 9.3%, ఎస్సీలపై వేధింపులు 13.1%, ఎస్టీలపై నేరాలకు సంబంధించి 14.3% మేర కేసులు ఎక్కువయ్యాయి. ఆర్థిక నేరాలు 11.1%, అవినీతి కేసులు 10.5%, సైబర్నేరాలు 24.4% వృద్ధి చెందాయి. మనుషుల అక్రమ రవాణా 2.8% ఎక్కువైంది. ఇందులో మిస్సింగ్ కేసులు 13.5% పెరగ్గా, ఆచూకీ తెలియని చిన్నారుల కేసులు 7.5% వృద్ధి చెందాయి. ఆస్తి సంబంధ నేరాలూ 10.1% పెరిగాయి.
- 2022లో గుర్తించదగ్గ నేరాలు మొత్తం 58,24,946 నమోదయ్యాయి. ఇందులో ఐపీసీ కింద 35,61,379, ఇతర ప్రత్యేక, స్థానిక చట్టాల కింద 22,63,567 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది నమోదైన 60,96,310 కేసులతో పోలిస్తే 2022లో 2,71,364 (4.5%) మేర తగ్గుదల నమోదైంది.
- క్రైం రేట్ (ప్రతి లక్ష మంది జనాభాకు) 445.9 నుంచి 422.2కు దిగివచ్చింది.
- దేశవ్యాప్తంగా 2022లో 1,07,588 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఇది క్రితం సంవత్సరం కంటే (1,01,707) 5.8% ఎక్కువ. ఇందులో మహిళలు (88,861) అత్యధికంగా ఉన్నారు. 2021తో పోలిస్తే ఐపీసీ కింద నమోదైన కేసులు 2.8%, ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదైన కేసులు 7% తగ్గాయి. సామాజిక ప్రశాంతతను దెబ్బతీసే కేసులు 63,391 నుంచి 57,082 (10%)కి తగ్గాయి.
- మహిళలపై కేసులు 4,28,278 నుంచి 4,45,256కు (4%) పెరిగాయి. ఇందులో భర్త, బంధువుల హింస (31.4%)కు సంబంధించినవే అత్యధికం ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో కిడ్నాప్ (19.2%), లైంగికదాడి (18.7%), అత్యాచారం (7.1%) కేసులు ఉన్నాయి. ప్రతి లక్ష మందిపై నమోదైన నేరాలు 2021లో 64.5 మేర ఉండగా, 2022లో ఆ సంఖ్య 66.4కి పెరిగింది.
- చిన్నారులపై నేరాలు 1,49,404 నుంచి 1,62,449కి (8.7%) పెరిగాయి. ఇందులో అత్యధికం కిడ్నాప్ (45.7%), అత్యాచారంతోసహా పోక్సో చట్టం కింద నమోదైన కేసులు (39.7%) ఉన్నాయి. చిన్నారులపై క్రైం రేట్ 33.6 నుంచి 36.6కు పెరిగింది.
- జువెనైల్ కేసులు 31,170 నుంచి 30,555 (2%)కు తగ్గాయి. 30,555 కేసుల్లో 37,780 మంది బాలలను అరెస్టు చేశారు. ఇందులో 78.6% మంది 16 నుంచి 18 ఏళ్లలోపువారే.
- సీనియర్ సిటిజన్లపై కేసులు 26,110 నుంచి 28,545(9.3%)కు పెరిగాయి. ఇందులో 27.3% సాధారణ దాడులకు సంబంధించినవికాగా, దొంగతనాలకు సంబంధించినవి 13.8%, ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్కు సంబంధించనవి 11.2% మేర ఉన్నాయి.
- ఎస్సీ అట్రాసిటీ కింద కేసులు 50,900 నుంచి 57,572 (13.1%)కి పెరిగాయి. వీరిపై క్రైమ్రేట్ ఏడాది కాలంలో 25.3 నుంచి 28.6కు పెరిగింది.
- ఎస్టీ అట్రాసిటీ కేసులు 8,802 నుంచి 10,064 (14.3)కి పెరిగాయి. వీరిపై క్రైమ్రేట్ 8.4 నుంచి 9.6కి పెరిగింది.
- ఆర్థిక నేరాల కేసులు 1,74,013 నుంచి 1,93,385 (11.1%) పెరిగాయి. ఇందులో విశ్వాసఘాతుకం, ఫోర్జరీ, చీటింగ్, దొంగనోట్ల కేసులు అత్యధికం ఉన్నాయి.
- రాష్ట్రాల అనిశాలు నమోదుచేసిన అవినీతి కేసులు 3,745 నుంచి 4,139 (10.5%)పెరిగాయి. ఇందులో 69.7% వలపన్ని పట్టుకున్నవే. ఈ కేసుల్లో 4,994 మందిని అరెస్ట్ చేయగా, అందులో 852 మందికి శిక్షపడింది.
- సైబర్నేరాలు ఏడాది కాలంలో 52,974 నుంచి 65,893 (24.4%)కు పెరిగాయి. ఈ విభాగంలో క్రైమ్ రేట్ 3.9 నుంచి 4.8కి పెరిగింది. ఇందులో 64.8% కేసులకు ప్రధాన కారణం మోసం. అక్రమ వసూళ్ల కింద 5.5%, లైంగిక దోపిడీ కింద 5.2% కేసులు నమోదయ్యాయి.
- రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నమోదైన కేసులు 5,164 నుంచి 5,610 (8.6%)కి పెరిగాయి. ఇందులో 78.5% కేసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసిన కారణంగా, 17.9% కేసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదయ్యాయి.
- విదేశీయులకు వ్యతిరేకంగా జరిగిన నేరాలకు సంబంధించిన కేసులు 150 నుంచి 192కి పెరిగాయి. ఇందులో 28% వృద్ధి నమోదైంది. ఇందులో 34 దొంగతనాలు, 28 అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. 192 కేసుల్లో 222 మంది బాధితులు ఉండగా, అందులో 56.8% మంది ఆసియా, 18% మంది ఆఫ్రికన్ ఖండాలకు చెందినవారు ఉన్నారు.
- విదేశీయులకు వ్యతిరేకంగా నమోదైన కేసుల సంఖ్య 2,585 నుంచి 2,100కి (18.8%) తగ్గిపోయింది.
- మనుషుల అక్రమ రవాణా కేసులు 2,189 నుంచి 2,250 (2.8%)కి పెరిగాయి. అక్రమరవాణాకు గురైన వారిలో 2,878 మంది చిన్నారులు ఉండగా, 3,158 మంది పెద్దలు ఉన్నారు.
- 2022లో 4,42,572 మంది వ్యక్తులు తప్పిపోయారు. అంతకుముందు సంవత్సరంకంటే ఇది 13.5% అధికం. ఇందులో 1,49,008 మంది పురుషులు, 2,93,500 మంది మహిళలు, 64 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 2022లో తప్పిపోయినవారిలో మొత్తం 4,01,077 మందిని గుర్తించారు.
- తప్పిపోయిన చిన్నారుల సంఖ్య ఏడాదిలో 77,535 నుంచి 83,350కి పెరిగింది. ఇందులో 20,380 మంది బాలురు, 62,946 మంది బాలికలు, 24 ట్రాన్స్జెండర్లు ఉన్నారు.
- ఆస్తి గొడవలకు సంబంధించిన 7,62,368 నుంచి 8,39,252 (10.1%)కి పెరిగాయి. ఇందులో 77.8% దొంగతనం, 12.8% దోపిడీకి సంబంధించినవి. ఈ ఏడాదిలో రూ.5,223.3 కోట్ల విలువైన ఆస్తులు చోరీకి గురయ్యాయి. అందులో రూ.1,882.5 కోట్ల ఆస్తులు రికవరీ అయ్యాయి.
- 2,79,185 ఆస్తి తగాదాలు నివాస ప్రాంగణాల్లో జరగ్గా, 16,014 దోపిడీలు జాతీయ రహదారులు, ఇతర రహదారుల్లో చోటుచేసుకున్నాయి.
- రూ.382.66 కోట్ల విలువైన 42,10,406 నకిలీ నోట్లను పట్టుకున్నారు.
- శిక్షలు అత్యారం కేసుల్లో అతితక్కువగా 27.4%మాత్రమే పడ్డాయి. హత్య కేసుల్లో 43.8%, కిడ్నాప్ కేసుల్లో 33.9%, దాడుల కేసుల్లో 35.9%, కలహాల కేసుల్లో 24.9% మాత్రమే శిక్షలు పడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు